ఏపీ సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్, ఈఓలతో ముచ్చటించిన పీఠాధిపతులు స్వరూపానంద టీటీడీ భూముల విక్రయం విషయంలో అన్నీ అలోచించి ఎలాంటి వివాదానికి తావులేని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. టీటీడీ యాజమాన్యం తీసుకునే ప్రతి నిర్ణయం భక్తుల మనోభావాలకు కూడా ముడిపడి ఉంటుందని, లాక్ డౌన్ ముగిసి, శ్రీవారి ఆలయాన్ని తిరిగి తెరిచే సమయంలో ఇలాంటి వివాదాలకు తావులేకుండా చూసుకోవాలని స్వరూపానంద తెలిపారు.
అంతే కాకుండా ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా, అనవసరంగా విశాఖ శారదాపీఠంపై దాడికి దిగితే ఉపేక్షించమని, పలువురు హిందూ మత వ్యతిరేకులు ఇది అదునుగా తీసుకొని రాజకీయ పార్టీల ముసుగులో శారదా పీఠంపై కుట్ర పన్నుతున్నారు, వారిని అడ్డుకుంటామని స్వరూపానంద అన్నారు.