ManaTeluguMovies.net | Live TV | Shows | News | Daily Serials

బుల్లితెరపై మరోసారి సత్తా చాటిన ‘జాంబీ రెడ్డి’

చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన తేజ సజ్జ హీరోగా పరిచయమైన చిత్రం ”జాంబీ రెడ్డి”. ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంది – దక్ష హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి వసూళ్ళు రాబట్టింది. కమర్షియల్ సక్సెస్ అందుకున్న ఈ సినిమాతో హీరోగా తేజ సక్సెస్ ఫుల్ గా లాంచ్ అయ్యాడు. వెండితెరపై ఆడియన్స్ ని అలరించిన ‘జాంబి రెడ్డి’.. బుల్లితెరపై కూడా సత్తా చాటింది.

మార్చి నెలలో ‘స్టార్ మా’ ఛానల్ లో టెలికాస్ట్ అయిన ‘జాంబి రెడ్డి’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 9.7 టీఆర్పీ రేటింగ్ సాధించింది. చిన్న సినిమాలలో ఇది మంచి రేటింగ్ అనే చెప్పాలి. ఈ క్రమంలో రీసెంటుగా స్టార్ మా లో రెండోసారి ప్రసారం చేయబడిన జాంబీల సినిమా అదిరిపోయే టీఆర్పీ దక్కించుకుంది. ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని రికార్డు స్థాయిలో 8.1 టీఆర్పీ రేటింగ్ అందుకుంది. సెకండ్ టైం టెలికాస్ట్ లో కూడా ఇంతటి టీఆర్పీ రాబట్టడం గొప్ప విషయమనే చెప్పాలి.

ఇటీవల టీవీల్లో టెలికాస్ట్ అయిన స్టార్ హీరోల సినిమాలు సైతం ఈ రేంజ్ టీఆర్పీ రాబట్టలేకపోయాయి. ఇప్పుడు ‘జాంబీ రెడ్డి’ చిత్రానికి స్మాల్ స్క్రీన్ పై వస్తున్న స్పందన చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ దీనిని బాగా ఆదరించారని అర్థం అవుతోంది. మన నేటివిటీతో తెలుగులో జాంబీల కాన్సెప్ట్ తో వచ్చిన ఫస్ట్ మూవీ కావడంతో అందరూ ఈ సినిమాపై ఆసక్తిని కనబరిచారు. టీవీల్లో రెండోసారి కూడా అదే జోరును చూపించడంపై చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

కాగా ‘జాంబీ రెడ్డి’ చిత్రాన్ని ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి స్క్రిప్ట్స్ విల్లే స్క్రీన్ ప్లే అందించగా.. మార్క్ కె రాబిన్ సంగీతం సమకూర్చారు. అనిత్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. సాయిబాబు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇందులో హర్షవర్ధన్ – రఘుబాబు – పృథ్వీరాజ్ – గెటప్ శ్రీను – హేమంత్ – హరితేజ – అన్నపూర్ణమ్మ – కిరీటి – రమ రఘు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

Exit mobile version