Advertisement

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ స్పెషల్ పిక్!!

Posted : January 11, 2021 at 8:53 pm IST by ManaTeluguMovies


ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘రౌద్రం రణం రుదిరం’. ఈ మల్టీస్టారర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. పాన్ ఇండియా సినిమాగా రూపు దిద్దుకుంటున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ కాబోతున్నాడు. మల్టీస్టారర్ కాబట్టి ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా నటిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అనేక బాషలలో విడుదల కానున్న ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు రిలీజ్ ఎప్పుడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్టీఆర్ సినిమాలతో ఎంతబిజీగా ఉన్నా సోషల్ మీడియాకి కూడా అప్పుడప్పుడు సమయం కేటాయిస్తూ ఉంటాడు. అలాగే పండుగల సందర్బంగా అభిమానులకు గ్రీటింగ్స్ మర్చిపోకుండా తెలియజేస్తాడు.

మొన్నటి క్రిస్మస్ పండుగకు కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు స్పెషల్ గ్రీటింగ్స్ తెలిపాడు. తన పిల్లలు అభయ్ రామ్ భార్గవ రామ్ ల పిక్ పోస్ట్ చేయడమే నందమూరి ఫ్యాన్స్ కి పండగ అనే చెప్పాలి. అయితే తాజాగా మరో పిక్ షేర్ చేసి ట్రీట్ ఇచ్చాడు. అందులోను ఒక కుర్రాడిని హగ్ చేసుకొని కనిపిస్తున్నాడు. అప్పటి నుండి ఆ ఎన్టీఆర్ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ స్వింగ్ అవుతోంది. అయితే ఎన్టీఆర్ కలిసింది తన స్నేహితుడే అని అనిపిస్తుంది. అంత క్లోస్ గా ఉన్నారు ఎన్టీఆర్ ఆ కుర్రాడు. అయితే ఇంస్టాగ్రామ్ మొత్తం ఎన్టీఆర్ కౌగిలించుకుంది ఎవరబ్బా..? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ మొత్తానికి సోషల్ మీడియా యూజర్స్ పట్టేసారు. ఎన్టీఆర్ పట్టుకుంది లగడపాటి అశ్రీత్. అయితే ప్రస్తుతం ఫుల్ డీటెయిల్స్ కనుక్కోడానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గాలం వేస్తూనే ఉన్నారు. ఇద్దరూ బెస్ట్ బడ్డీస్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నాడు.


Advertisement

Recent Random Post:

జగన్ క్యాంపైన్ తో వైసీపీలో కొత్త జోష్ | CM YS Jagan | AP Elections 2024

Posted : April 24, 2024 at 11:31 am IST by ManaTeluguMovies

జగన్ క్యాంపైన్ తో వైసీపీలో కొత్త జోష్ | CM YS Jagan | AP Elections 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement