Advertisement

లావణ్య, నిహారికల్లో ఎవరు ముఖ్యం.. వరుణ్‌ సూపర్ ఆన్సర్‌

Posted : August 22, 2023 at 9:26 pm IST by ManaTeluguMovies

మెగా ఫ్యామిలీ లో పెళ్లి వేడుకకు రంగం సిద్ధం అయింది. వచ్చే నెల లేదా అక్టోబర్‌ లో వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ముహూర్తం దాదాపుగా ఖరారు అయినట్లుగా సమాచారం అందుతోంది. వీరిద్దరిదీ ప్రేమ వివాహం అనే విషయం తెల్సిందే. వీరి ప్రేమ విషయం గురించి చాలా రోజులుగా ప్రచారం జరిగింది కానీ చాలా మంది పుకార్లే అనుకున్నారు.

నిశ్చితార్థం వరకు కూడా వరుణ్‌, లావణ్య ల ప్రేమ విషయంలో క్లారిటీ రాలేదు. నిశ్చితార్థం ఫోటోలు చూసే వరకు కూడా చాలా మంది నిజమా అన్నట్లుగానే ఉన్నారు. లావణ్య త్రిపాఠి అంటే వరుణ్‌ కు ఎంత ప్రేమ ఉందో నిశ్చితార్థం సమయంలోనే వెల్లడి అయింది. ఇద్దరి జంటకు అందరి ఆశీర్వాదాలు లభించాయి.

అంతా బాగానే ఉంది అనుకుంటూ ఉండగా వరుణ్‌ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య సరదాగా యాంకర్ సుమ పుల్ల పెట్టినట్లుగానే అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే వరుణ్‌ తేజ్‌ నటించిన గాండీవధారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ వేడుకలో యాంకర్‌ గా సుమ వ్యవహరించారు.

కార్యక్రమం సమయంలోనే వరుణ్ తేజ్ వద్దకు సుమ వెళ్లి ఒకే సారి లావణ్య మరియు నిహారికలు కాల్‌ మీ అంటూ మెసేజ్ చేస్తే ఎవరికి ముందు కాల్‌ చేస్తారు అంటూ సుమ ప్రశ్నించింది. అప్పుడు వరుణ్ తేజ్‌ కాస్త కంగారు పడి చిన్నది కావున చెల్లి నిహారిక కు చేస్తాను అంటూ సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో సంతృప్తి చెందిన సుమ మంచి మార్కులు ఇస్తున్నాం అంది.

అంతే కాకుండా లావణ్య తో ఏమైనా సమస్య ఉంటే ఇంటికి వెళ్లి చూసుకోండి అంటూ సరదాగా మాట్లాడటంతో అక్కడున్న వారు అంతా కూడా గట్టిగా నవ్వేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతూ, వరుణ్‌ కి లావణ్య కి మధ్య సుమ చిచ్చు పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan

Posted : October 4, 2024 at 12:02 pm IST by ManaTeluguMovies

Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad