Advertisement

అనుష్క ఏరికోరి ఎంచుకున్న కథ.. ఎలా ఉంటుందో..!

Posted : August 1, 2023 at 10:09 pm IST by ManaTeluguMovies

స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ఉన్న నటి అనుష్క. ఒకప్పుడు హీరోలతో పాటు, లేడీ ఓరియంటెడ్ మూవీలతో అలరించింది. అయితే, అనుష్క ను తెరపై చూసి చాలా కాలమే అవుతుంది. బాహుబలి హిట్ తర్వాత ఆమెకు ఆఫర్లు క్యూ కట్టి, బిజీ అవ్వాల్సిందిపోయి సీన్ రివర్స్ అయ్యింది. ఆ మూవీ తర్వాత అనుష్క నిశ్శబ్దం అనే సినిమా చేసింది. అది కూడా క్లిక్ అవ్వలేదు. అంతే, మళ్లీ కనిపించలేదు.

అయితే, ఆ తర్వాత ఆమెతో నటించడానికి దర్శక నిర్మాతలు ఎక్కువ ఆసక్తే చూపిచారట. కానీ, కథ నచ్చక అనుష్క అంగీకరించలేదు. ఆమె ఒప్పుకున్న కథ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి . యువ హీరో నవీన్ పొలిశెట్టికి జంటగా నటించింది. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవతుందా అని స్వీటీ ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

వారి ఎదురుచూపులకు తగ్గట్టు, ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. మేలో రావాల్సిన మూవీ, ఆగస్టుకు చేరుకుంది. తాజాగా ఈ మూవీని ఆగస్టు 18వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. ఇక ఈ తేదీని కన్ఫామ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు, మూడు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక మూవీ ప్రమోషన్స్ లో సైతం అనుష్క చురుకుగా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే నవీన్ పొలిశెట్టి తనదైన శైలిలో ప్రచారం మొదలుపెట్టడం విశేషం.

ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, కొన్ని పాటలు ఆకట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ మరో పాటను కూడా విడుదల చేశారు. ఆ పాటలో అనుష్క పెళ్లి సంబంధాలు చూడటం, ఎవరూ నచ్చక విసిగిపోవడం కనపడుతోంది. పి మహేష్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.

యంగ్ హీరో సరసన అనుష్క శెట్టి జత కట్టడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇలా ఉండబోతోంది.. అసలు ఈ చిత్రంలో అనుష్క గ్లామర్.. నవీన్ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతున్నాయి అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఉంది. మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan

Posted : October 4, 2024 at 12:02 pm IST by ManaTeluguMovies

Andhra Pradesh : వైసీపీలో కొత్త జోష్ నింపుతున్న YS Jagan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad