Advertisement

అర్జున్ మోడీ ని కలవడానికి ఒక కారణం ఉంది

Posted : January 22, 2024 at 4:06 pm IST by ManaTeluguMovies

యాక్షన్ కింగ్ అర్జున్ తనకు ఆంజనేయునిపై ఉన్న భక్తితో సొంత ఖర్చులతో గుడి నిర్మించారు. ఆ గుడి నిర్మాణం పూర్తి అయిన తర్వాత 2022లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. అనేక మంది ప్రముఖులు ఈ ఆలయాన్ని సందర్శించారు.

తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా పలు ఆలయాలను సందర్శించారు. ఆ సమయంలో అర్జున్ మరియు ఆయన కూతురు ఐశ్వర్య కలిసి మోడీని కలిశారు. ఈ సందర్భంగా అర్జున్ తన కూతురు ఐశ్వర్యతో కలిసి తాము నిర్మించిన హనుమంతుడి ఆలయంను సందర్శించాలని మోడీకి విజ్ఞప్తి చేశారు.

అర్జున్ విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారు. మరోసారి తమిళనాడు వచ్చిన సమయంలో తప్పకుండా హనుమంతుడి కొత్త ఆలయంను సందర్శిస్తాను అని చెప్పారు.

అర్జున్‌ తన భక్తిని చాటుకునే ఈ చర్య అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ మధ్య కాలంలో అర్జున్‌ వరుసగా విలన్ రోల్స్‌లో నటిస్తున్నాడు. లియో సినిమాలో అర్జున్ పోషించిన విలన్ రోల్‌కి మంచి గుర్తింపు దక్కింది. తమిళ్‌లోనే కాకుండా తెలుగులో కూడా వరుసగా అర్జున్ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇక అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే.


Advertisement

Recent Random Post:

Super Prime Time :తిరుమల లడ్డూ వివాదంలో సరికొత్త ట్విస్ట్ | Twist In Tirumala Laddu Controversy

Posted : October 1, 2024 at 10:41 pm IST by ManaTeluguMovies

Super Prime Time :తిరుమల లడ్డూ వివాదంలో సరికొత్త ట్విస్ట్ | Twist In Tirumala Laddu Controversy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad