Advertisement

దిల్ రాజు సెట్ చేస్తున్న మరో క్రేజీ కాంబో

Posted : October 7, 2024 at 8:07 pm IST by ManaTeluguMovies

రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ కాంబినేషన్స్ ను సెట్ చేయడంలో దిల్ రాజు ముందుంటారు. అలాగే ఈ మధ్య కాలంలో డైరెక్టర్ హీరో కాంబినేషన్ ను కూడా ఆయనే ఎక్కువగా రిపీట్ చేస్తున్నారు. ఇక త్వరలోనే మరో క్రేజీ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కాంబోలో దర్శకుడు మరెవరో కాదు.. గీతగోవిందం ఫేమ్ పరశురామ్.

‘ఫ్యామిలీస్టార్’ తర్వాత పరశురామ్ దర్శకత్వంలో ఏ సినిమా వస్తుందనే ఆసక్తి సినీ వర్గాల్లో చాలా కాలంగా నెలకొని ఉంది. ఈ దశలో, కార్తి హీరోగా ఓ కథ రెడీ చేసుకొని ఉన్నారని టాక్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చకపోవడంతో, పరశురామ్ తదుపరి సినిమా విషయంలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, సిద్దు జొన్నలగడ్డతో సినిమా చేయడానికి పరశురామ్ దాదాపు సిద్ధమయ్యారని టాక్.

ఈ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు బ్యానర్‌లో రూపొందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సిద్దు జొన్నలగడ్డతో దిల్ రాజు ఓ సినిమా చేయాలనుకున్నాడనే మాట ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. ఈ మేరకు ఓపెనింగ్ కూడా జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ‘ఫ్యామిలీస్టార్’ ప్రాజెక్ట్ సమయంలో దిల్ రాజు సంస్థలో మరో సినిమా చేయడానికి పరశురామ్ కూడా ఒప్పందం చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

దిల్ రాజు, పరశురామ్, సిద్దు ల కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికైతే, ఈ సినిమా విషయంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. మొదట, కార్తి కోసం సిద్ధం చేసిన కథను సిద్దు జొన్నలగడ్డతో తీసుకురాబోతున్నారా? లేదా సరికొత్త కథను ఈ ప్రాజెక్ట్ కోసం రెడీ చేస్తారా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఏదైనా, సిద్దు, పరశురామ్ కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరిచింది.

ఇక, సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో ‘తెలుసు కదా’ అనే మరో ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్స్ దాదాపుగా పూర్తి కావచ్చాయి. వీటి తర్వాతే పరశురామ్ దర్శకత్వంలో ఈ కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సిద్దు తన గత సినిమాల్లో చూపిన నటనా ప్రతిభతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు.

‘డీజే టిల్లు’తో కేవలం కామెడీ గానే కాకుండా సిద్దు అందించిన వినూత్న నటన కూడా ప్రేక్షకులను మెప్పించింది. ఆయన స్టైల్, నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని కలిపి యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఇక పరశురామ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ‘గీతగోవిందం’, ‘సర్కారు వారి పాట’ వంటి సినిమాలతో మాస్, క్లాస్ ప్రేక్షకుల మధ్య తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు.


Advertisement

Recent Random Post:

తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు | China Launches Large Military Drills Surrounding Taiwan

Posted : October 15, 2024 at 2:06 pm IST by ManaTeluguMovies

తైవాన్‌ చుట్టూ చైనా సైనిక విన్యాసాలు | China Launches Large Military Drills Surrounding Taiwan

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad