Advertisement

25 ఏళ్ల పాటు భ‌ర్త‌ని ప్రశ్నించని ఒకే ఒక్క భార్య‌!

Posted : October 3, 2024 at 6:22 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్ లో నెటి జ‌న‌రేష‌న్ వివాహ క‌ల్చ‌ర్ ఎలా కొన‌సాగుతుందో? తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఏడాది కాలంలో ఏదో కార‌ణాలతో విడాకులు అంటూ కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. వివాహం కూడా అక్క‌డో ప్రెండ్ షిప్ లా మారింది. స్నేహంలో చిన్న పాటి మ‌నస్ప‌ర్ద‌లొస్తే ఎలా దూర‌మ‌వుతారో? మ్యారేజ్ అనే వ్య‌వ‌స్థ లోనూ అదే క‌నిపిస్తుంది. ఇంకా స్నేహంలోనైనా కొన‌సాగించ‌డానికి ఆలోచిస్తారేమో గానీ, ల‌వ్ బ్రేక‌ప్…వివాహాన్ని బ్రేక‌ప్ చేసుకోవ‌డానికి మాత్రం ఎంత మాత్రం ఆలోచించ‌రు.

అక్క‌డ పెళ్లిళ్లు అలాగే జ‌రుగుతున్నాయి.. విడాకులు అంతే వేగంగా తెర‌పైకి వ‌స్తున్నాయి. మ‌రి 25 ఏళ్ల పాటు భ‌ర్త‌ని ప్ర‌శ్నించ‌ని భార్య ఎవ‌రైనా ఉన్నారా? అంటే ఈ జంట‌ని మాత్రం ఆద‌ర్శ దంపతులుగా చెప్పాలి. పాత‌రం న‌టులు దిలీప్ కుమార్- సైరా భాను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు 1996లో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. 25 ఏళ్ల పాటు క‌లిసి కాపురం చేసారు.

కానీ అనారోగ్య కార‌ణంతో దిలీప కుమార్ 2021లో క‌న్ను మూసారు. అలా ఆ జంట‌ని మ‌ర‌ణం వేరు చేసింది. కానీ ఇన్నేళ్ల కాపురంలో ఏనాడు భ‌ర్త‌ను ఒక్క ప్ర‌శ్న కూడా వేయ‌లేదు అన్న విష‌యాన్ని తాజాగా సైరా భాను తెలిపారు. ప్రేమ‌లో బ‌ల‌మైన న‌మ్మ‌కం ఉంటే ప్ర‌శ్నించే అవ‌స‌రం రాద‌న్నారు. `నాస్వీట్ హార్ట్ దిలీప్ తో 1996 అక్టోబ‌ర్ 2న ప్ర‌యాణం ప్రారంభించాను. అప్ప‌టి నుంచి ఏ రోజు ప్ర‌శ్నించ‌లేదు.

ఇన్నేళ్ల ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాలు ఎదుర‌య్యాయి. అయినా నేను ఆయ‌న మీద‌..ఆయ‌న నామీద ఏనాడు న‌మ్మ‌కం కోల్పోలేదు. ప్రేమ‌లో కేవ‌లం ఆరాధ‌న మాత్ర‌మే ఉండాలి. అనుమాన‌లు, అప‌ర్దాల‌కు దారి ఇవ్వ‌కూడ‌దు. ఆభ‌క్తిలోనే నిజ‌మైన ప్రేమ ఉంది` అన్నారు.


Advertisement

Recent Random Post:

మావోయిస్టులకు డేంజర్ జోన్ గా మారిన దండకారణ్యం | Dandakaranyam | Chhattisgarh |

Posted : October 14, 2024 at 1:15 pm IST by ManaTeluguMovies

మావోయిస్టులకు డేంజర్ జోన్ గా మారిన దండకారణ్యం | Dandakaranyam | Chhattisgarh |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad