Advertisement

కోమటి కమలమ్మ మృతి పట్ల పలువురి సంతాపం

Posted : April 10, 2020 at 4:26 pm IST by ManaTeluguMovies

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) మాజీ అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రతినిధి, కోమటి జయరాం తల్లి కోమటి కమలమ్మ ఏప్రిల్ 9, గురువారం తెల్లవారుజామున(భారత కాలమానం) 2:15లకు కన్నుమూశారు. ఆమె వయస్సు 85 సంవత్సరాలు.

కృష్ణాజిల్లా మైలవరం మాజీ ఎమ్మెల్యే దివంగత కోమటి భాస్కరరావుసతీమణి కమలమ్మ. కోమటి భాస్కరరావు ఎమ్మెల్యేగానే కాకుండా సమితి అధ్యక్షునిగా, మార్కెటింగ్ సొసైటీ అధ్యక్షుడిగా కోమటి భాస్కరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు.

కోమటి భాస్కరరావు చిన్న కుమారుడు సుధాకర్ 1999 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేయగా, మనవడు అప్పసాని సందీప్ 2009 లో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసారు. కరోనా వైరస్‍ కారణంగా అంతర్జాతీయ ప్రయాణాల మీద నిషేధం కారణంగా అమెరికా నుంచి ఇండియా వచ్చే అవకాశాలు లేకపోవడంతో అంత్యక్రియలకు ఇండియాకు వెళ్ళలేకపోతున్నందుకు చాలా బాధగా ఉందని జయరాం కోమటి తెలిపారు.

కరోనా ఇబ్బందుల కారణంగా ఈరోజు ఉదయమే తల్లి అంత్యక్రియలను నిర్వహిస్తున్నట్లు చిన్నకుమారుడు సుధాకర్‍ కోమటి తెలిపారు. కాగా కమలమ్మ మృతి పట్ల అమెరికా, కెనడా,బ్రిటన్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి పలువురు ఎన్నారైలు జయరాం కుటుంబానికి తమ సంతాపాన్ని తెలిపారు.


Advertisement

Recent Random Post:

CM YS Jagan Election Campaign || ఇవాళ రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో సభలు || AP Elections 2024

Posted : May 6, 2024 at 11:37 am IST by ManaTeluguMovies

CM YS Jagan Election Campaign || ఇవాళ రేపల్లె, మాచర్ల, మచిలీపట్నంలో సభలు || AP Elections 2024\

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement