Advertisement

లాక్ డౌన్ ను ఫుల్లుగా ఉపయోగించుకుంటున్న త్రివిక్రమ్

Posted : April 11, 2020 at 5:02 pm IST by ManaTeluguMovies

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జనాలను ఎంటర్టైన్ చేసే సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. తన మాటలతో కట్టి పడేసే త్రివిక్రమ్ కు ఈ ఏడాది అల వైకుంఠపురములో చిత్రంతో సూపర్ డూపర్ హిట్ సాధ్యమైంది. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. బాహుబలి కలెక్షన్స్ ను కూడా దాటిపోయిందీ చిత్రం. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాతి సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ అల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న విషయం తెల్సిందే.

జూన్ నుండి ఎన్టీఆర్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. సాధారణంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్ట్ రాసుకునే విషయంలో ఎక్కువ సమయం తీసుకుంటాడు. మొదట స్క్రిప్ట్ రాసుకుని తర్వాత దానికి డైలాగ్స్ వెర్షన్ సిద్ధం చేసుకుని మొత్తానికి ఆరు నెలలకు పైగా దీనికే సమయం వెచ్చిస్తాడు. అయితే నాలుగే నెలల్లో ఎన్టీఆర్ సినిమాకు స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చేయాల్సి రావడంతో మొదట కొంత ఒత్తిడికి గురయ్యాడు.

అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయడానికి మినిమమ్ ఆగస్ట్ వరకూ టైమ్ పట్టొచ్చు. ఈ ఏడాది చివరికి కానీ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమా మొదలయ్యే అవకాశాలు లేవు. అనుకోకుండా వచ్చిన ఈ గ్యాప్ ను స్క్రిప్ట్ బెటర్మెంట్ కోసం ఉపయోగిస్తున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో ఫుల్ హ్యాపీస్.


Advertisement

Recent Random Post:

Kolkata Doctor Case: బెంగాల్లో ఏంజరుగుతోంది..? సీబీఐకి కేసు సవాలుగా మారిందా..?| Special Focus |

Posted : September 13, 2024 at 8:21 pm IST by ManaTeluguMovies

Kolkata Doctor Case: బెంగాల్లో ఏంజరుగుతోంది..? సీబీఐకి కేసు సవాలుగా మారిందా..?| Special Focus |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad