Advertisement

చైతూ మూవీని వదిలేయలేదంటున్న పరశురామ్‌

Posted : April 17, 2020 at 10:09 pm IST by ManaTeluguMovies

కొన్ని రోజుల క్రితం గీత గోవిందం దర్శకుడు పరశురామ్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 14 రీల్స్‌ నిర్మాతలు ఒక సినిమాను నిర్మించబోతున్నట్లుగా ఒక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చైతూ చేస్తున్న లవ్‌ స్టోరీ పూర్తి అయిన వెంటనే పరశురామ్‌ దర్శకత్వంలో మూవీ ఉంటుందని అంతా అనుకున్నారు. కాని సినిమా షూటింగ్‌ మొదలు కావాల్సిన సమయంలో అనూహ్యంగా పరశురామ్‌కు మహేష్‌బాబు నుండి పిలుపు రావడంతో చైతూ మూవీ పక్కకు పెట్టేశారని వార్తలు వస్తున్నాయి.

పరశురామ్‌ ప్రస్తుతం మహేష్‌బాబు 27వ చిత్రం స్క్రిప్ట్‌ పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు పరశురామ్‌తో మీడియా ప్రతినిధి మాట్లాడిన సమయంలో నాగచైతన్య మూవీ విషయం ఏంటీ అంటూ ప్రశ్నించగా తప్పకుండా నాగచైతన్యతో మూవీ ఉంటుందని పేర్కొన్నాడు. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఆయన మహేష్‌బాబు సినిమా చేస్తున్నట్లుగా కూడా కన్ఫర్మ్‌ చేయడంలేదు.

స్క్రిప్ట్‌కు మహేష్‌బాబు ఓకే చెప్పిన తర్వాతే పరశురామ్‌ సినిమా విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మహేష్‌బాబు స్క్రిప్ట్‌ ఓకే చేస్తే వెంటనే ఆయనతో పరశురామ్‌ సినిమా మొదలు పెడతాడట. లేదంటే నాగచైతన్యతోనే సినిమా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్‌బాబుతో పరశురామ్‌ సినిమాను కూడా 14 రీల్స్‌ వారే నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.


Advertisement

Recent Random Post:

YS Bharathi Reddy | Chairperson of Sakshi Group & Wife of AP CM YSJagan | Elections TELANGANA&AP #21

Posted : May 6, 2024 at 1:57 pm IST by ManaTeluguMovies

YS Bharathi Reddy | Chairperson of Sakshi Group & Wife of AP CM YSJagan | Elections TELANGANA&AP #21

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement