Advertisement

రెండునెల‌ల త‌ర్వాత ప్ర‌త్య‌క్ష‌మైన‌ బాలీవుడ్ బ్యూటీ

Posted : May 12, 2020 at 8:53 pm IST by ManaTeluguMovies

క‌రోనా లాక్‌డౌన్‌తో ఎక్క‌డి వాళ్లు అక్క‌డ ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఫిజిక‌ల్ డిస్టెన్స్ ఒక్క‌టే క‌రోనా క‌ట్ట‌డికి మార్గం కావడం తో…త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితుల్లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి వ‌చ్చింది. ఇక సినీ సెల‌బ్రిటీలైతే ఇళ్ల‌కే ప‌రిమిత‌మై సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో ముచ్చ‌ట్లు చెప్పుకుంటున్నారు.

ప్ర‌ముఖ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా రెండు నెల‌ల త‌ర్వాత ఎట్ట‌కేల‌కు ఇంటి నుంచి బ‌య‌టికి వ‌చ్చి ప్ర‌పంచాన్ని ద‌ర్శించారు. భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న ప్రియాంక ముఖానికి మాస్క్ ధ‌రించి అన్ని జాగ్ర‌త్త‌ల‌తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. రెండు నెల‌ల త‌ర్వాత ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెట్టిన విష‌యాన్ని ప్రియాంక చోప్రా తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్ల‌డించారు.

క‌రోనా వైర‌స్ యూఎస్‌ను బెంబేలెత్తిస్తోంది. ఇప్ప‌టికే ఆ దేశంలో 80 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడిప్పుడే ఆ దేశం క్ర‌మంగా కోలుకుంటోంది. ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి వ‌స్తున్నారు. ఆ దేశంలోని లాస్ ఏంజెల్స్‌లో ఉంటున్న‌ ప్రియాంక కుటుంబం కూడా అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. ఇంటి నుంచి బ‌య‌ట అడుగు పెట్టిన సంద‌ర్భంగా త‌న అభిప్రాయాల‌ను ఆమె అభిమానుల‌తో పంచుకున్నారు. “కళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండవు.. రెండు నెల‌ల త‌ర్వాత బ‌య‌ట‌కి వ‌చ్చాను. మాస్క్‌కి ధ‌న్య‌వాదాలు” అంటూ ఇన్‌స్టాలో ఆమె కామెంట్ పెట్టారు.


Advertisement

Recent Random Post:

ముంబయి నటి కేసులో వైకాపా సకల శాఖల మంత్రి! | YCP Minister & IAS Officer Role In Mumbai Actress Case

Posted : September 19, 2024 at 1:48 pm IST by ManaTeluguMovies

ముంబయి నటి కేసులో వైకాపా సకల శాఖల మంత్రి! | YCP Minister & IAS Officer Role In Mumbai Actress Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad