Advertisement

బాలీవుడ్‌లో మాన‌వ‌త్వం ఎక్క‌డ‌? – కొమురం పులి గాండ్రింపు

Posted : June 18, 2020 at 7:10 pm IST by ManaTeluguMovies

త‌న‌ది ఒకే ఒక్క ప్ర‌శ్న అంటూ కొమురం పులి గాండ్రించింది. ఆ గాండ్రింపుల‌కు నెటిజ‌న్ల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ ఆత్మ‌హ‌త్య నేప‌థ్యంలో బాలీవుడ్‌లో వివ‌క్ష‌, అణ‌చివేత గురించి ఒక్కొక్క‌రు నోరు తెరుస్తున్నారు. బాలీవుడ్‌ను ఏలుతున్న వారిని నిల‌దీస్తున్నారు.

బాలీవుడ్ దుష్ప‌రిణామాల‌పై ఇప్ప‌టికే హీరోయిన్లు కంగ‌న‌, శ్ర‌ద్ధా దాస్‌, పాయ‌ల్ త‌దిత‌రులు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడా జాబితాలో ‘కొమురం పులి’ హీరోయిన్ నికీషా ప‌టేల్ కూడా చేరారు. బాలీవుడ్ ప్ర‌ముఖుల‌పై కాస్త విమ‌ర్శ‌ల వేడి పెంచారామె.

సుశాంత్ అంత్య‌క్రియ‌ల‌కు బాలీవుడ్ ప్ర‌ముఖులెవ‌రూ హాజ‌రు కాక‌పోవ‌డంపై నికీషా ఘాటైన ట్వీట్ చేశారు. వైర‌ల్‌గా మారిన ఆ ట్వీట్ ఏంటంటే… ‘నాది ఒకే ఒక్క ప్రశ్న. సుశాంత్ అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులెవరూ ఎందుకు హాజరు కాలేదు. లంచ్ చేస్తూ బిజీగా ఉన్నారా. మానవత్వం ఎక్కడ‌’ అంటూ నికీషా సూటిగా, స్ప‌ష్టంగా ప్ర‌శ్నించారు.

నికీషా ట్వీట్‌పై నెటిజ‌న్ల నుంచి ఊహించ‌ని విధంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. సుశాంత్ ఏమైనా స్టార్ వారసుడా? సుశాంత్ లాంటి వాళ్లు చనిపోతే వారు ఎందుకు పట్టించుకుంటారు అని , అలాగే సుశాంత్ మృతికి కారణమైన వారెవరూ అతని అంత్యక్రియలకు హాజరు కాలేదు అంటూ మ‌రికొంద‌రు నెటిజన్లు ట్వీట్లు చేశారు. మ‌రి కొంద‌రు హీరోలంటే వార‌సుల పిల్ల‌లే, వాళ్ల ప్రాణాల‌కే విలువ త‌ప్ప త‌క్కిన వాళ్ల‌కు కాదు అని ఘాటుగా కామెంట్స్ చేశారు. మొత్తానికి సుశాంత్ ఆత్మ‌హ‌త్య బాలీవుడ్ అస‌లు రంగును బ‌య‌ట పెట్టింద‌ని చెప్పొచ్చు.


Advertisement

Recent Random Post:

తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ డిక్లరేషన్‌ LIVE | Deputy CM Pawan Kalyan Visits Tirumala

Posted : October 2, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

తిరుమలలో పవన్‌ కల్యాణ్‌ డిక్లరేషన్‌ LIVE | Deputy CM Pawan Kalyan Visits Tirumala

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad