Advertisement

ఎక్స్ క్లూజివ్: మహేష్ కోసం మహానటికి భారీగానే ముట్టజెప్పారట.!

Posted : October 21, 2020 at 12:00 pm IST by ManaTeluguMovies

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆ సినిమా తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుంటున్నానన్నారు, ఆ 3 నెలలకి కోవిడ్ రూపంలో మరో 6 నెలలు సెలవులొచ్చాయి. ఇప్పటికైనా ఆ సెలవులకి స్వస్తి చెప్పి మహేష్ బాబు తన తదుపరి సినిమా ‘సర్కారు వారి పాట’ని మొదలు పెట్టాలని చూస్తున్నారు. కానీ నవంబర్ లో ప్లాన్ చేసిన యుఎస్ షెడ్యూల్ కి వీసాలు ఇంకా అప్రూవ్ కాకపోవడంతో ఈ చిత్ర టీం కాస్త టెన్షన్ లో ఉన్నారు.

మొదటి నుంచీ ఎవరు ఈ సినిమాలో మహేష్ తో జోడీ కట్టనున్నారు అని పలువురు పేర్లు వినిపిస్తున్న టైంలో కీర్తి సురేష్ జోడీ కట్టనుందని తెలిపాము. అదే విషయాన్ని ఇటీవలే జరిగిన కీర్తి సురేష్ పుట్టిన రోజు నాడు మహేష్ అండ్ టీం అధికారికంగా అనౌన్స్ చేశారు. తాజాగా మేము తెలుసుకున్న ఎక్స్ క్లూజివ్ న్యూస్ ప్రకారం, కీర్తి సురేష్ తెలుగులో అత్యధికంగా 1.5 కోట్ల రెమ్యునరేషన్ అందుకోనున్నారట.

మహానటి తర్వాత తెలుగులో వరుసగా సినిమాలు సైన్ చేసినప్పటికీ ఇంకా ఏదీ రిలీజ్ కాలేదు. అలాగే తాను సైన్ చేసినవన్నీ ఒక మోస్తరు బడ్జెట్ సినిమాలు కావడం వలన కోటి రూపాయల్లోపే పారితోషికం తీసుకున్నారు. స్టార్ పవర్ ఉన్న సినిమా కావడంతో ఈ చిత్ర నిర్మాతలని బాగానే డిమాండ్ చేసిందట. దాంతో తన రెమ్యునరేషన్ 1.5 కోట్లకి ఫిక్స్ చేశారట. అలా కీర్తి సురేష్ తెలుగులో భారీ రెమ్యునరేషన్ కొట్టేసింది. మైత్రి మూవీ మేకర్స్ – 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి పరశురామ్ దర్శకుడు.


Advertisement

Recent Random Post:

పాపం మీదంటే మీది అని అధికార, ప్రతిపక్షాల విమర్శలు | Tirupati Laddu Row

Posted : September 24, 2024 at 12:03 pm IST by ManaTeluguMovies

పాపం మీదంటే మీది అని అధికార, ప్రతిపక్షాల విమర్శలు | Tirupati Laddu Row

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad