Advertisement

బిగ్ బాస్ 4: జోర్దార్‌ సుజాత రీ ఎంట్రీ

Posted : October 24, 2020 at 7:30 pm IST by ManaTeluguMovies

బిగ్‌ బాస్‌ లో ఏమైనా జరగొచ్చు అంటూ ఉంటారు. ఉంటారు అనుకున్న వాళ్లు వెళ్తారు.. వెళ్తారు అనుకున్న వారు ఉంటారు. అప్పుడప్పుడు షాక్‌ లు ఇస్తూ వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలు.. వైల్డ్‌ రీ ఎంట్రీలు కూడా ఉంటాయి. ఇప్పటి వరకు బిగ్‌ బాస్‌ నుండి సూర్య కిరణ్‌, కరాటే కళ్యాణి, దేవి, స్వాతి, సుజాత, కుమార్‌ సాయిలు ఎలిమినేట్‌ అయ్యారు.

ఈ వారంలో ఎలిమినేట్‌ కాకుండా రీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఎలిమినేట్‌ అయిన ఆరుగురిలో రీ ఎంట్రీకి సుజాత మరియు స్వాతిలు ఆసక్తిగా ఉన్నారని వారిద్దరిలో ఎవరు అయితే బెటర్‌ అనుకుని చివరకు సుజాతను రీ ఎంట్రీ ఇప్పించాలనే నిర్ణయానికి బిగ్‌ బాస్‌ టీం వచ్చినట్లుగా తెలుస్తోంది.

రేపు దసరా సందర్బంగా సమంత హోస్ట్‌ గా మూడు గంటల పాటు షో సాగనుంది. ఆ సందర్బంగానే జోర్దార్‌ సుజాతను రీ ఎంట్రీ ఇప్పించేందుకు రెడీ అవుతున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటల నుండి మొదలుకుని సందడే సందడి కొనసాగబోతుంది. జోర్దార్‌ సుజాత ఎలిమినేషన్‌ విషయంలో ఎలాంటి విమర్శలు అయితే రాలేదు. ఆమె వెళ్తుందని అంతా అనుకున్నారు. అన్నట్లుగానే వెళ్లింది. కాని దేవి మరియు కుమార్‌ సాయిల విషయంలో మాత్రం అన్యాయం జరిగిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

వాళ్లలో ఎవరినైనా రీ ఎంట్రీ ఇప్పిస్తే బాగుండేది. కాని వారిద్దరికి కూడా రీ ఎంట్రీకి అస్సలు ఆసక్తి లేనట్లుగా తెలుస్తోంది. అందుకే జోర్దార్‌ సుజాతను పంపించేందుకు ప్లాన్‌ చేశారు. గత పది రోజులుగా జోర్దార్‌ సుజాత క్వారెంటైన్‌ లో ఉందట. అందుకే ఆమె షో లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఆమె రీ ఎంట్రీతో మళ్లీ ఇంట్లో సందడి వాతావరణం ఉంటుందని అంతా భావిస్తున్నారు. రేపు ఏం జరుగబోతుందో చూడాలి.


Advertisement

Recent Random Post:

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విషాదం

Posted : September 19, 2024 at 10:43 pm IST by ManaTeluguMovies

Shamshabad Airport : శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విషాదం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad