Advertisement

నాని 28వ సినిమా అధికారిక ప్రకటన

Posted : November 18, 2020 at 10:10 pm IST by ManaTeluguMovies

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా న్యాచురల్ స్టార్ నాని వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. వి సినిమా యావరేజ్ ఫలితం తర్వాత నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ లో నటించాల్సి ఉంది.

రాహుల్ శంకిట్ర్యాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. కృతి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు మరోవైపు నాని 28వ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. “అంటే… #Nani28. రేపు మంచి రోజట..రేపు మాట్లాడుకుందాం” అని మైత్రి మూవీస్ సంస్థ ప్రకటించింది. అంటే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు రేపు రానున్నాయి.


Advertisement

Recent Random Post:

కూటమికి ముప్పుతిప్పలు పెడుతున్న గాజు గ్లాసు | Janasena | OTR

Posted : April 26, 2024 at 12:31 pm IST by ManaTeluguMovies

కూటమికి ముప్పుతిప్పలు పెడుతున్న గాజు గ్లాసు | Janasena | OTR

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement