Advertisement

బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 87 – అవినాష్‌ ఆడలేక అరుపులు.. ఫినాలే మెడల్‌ కోసం ప్రాణం పెట్టిన ఇతరులు

Posted : December 2, 2020 at 12:24 pm IST by ManaTeluguMovies

అంత అన్నట్లుగానే ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయిన వెంటనే అవినాష్‌ పూర్తిగా మారిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటాడు. ఆయన వ్యవహారం తీరు మరియు ఆయన ఆట తీరు మారిపోతుంది అనడంలో సందేహం లేదు. సహనం కోల్పోతూ ఉంటాడు. ప్రతి సారి కూడా ఏదో ఒక విషయంలో ఇతరులతో గొడవ పడుతూనే ఉంటాడు. తాజాగా బిగ్‌ బాస్‌ ఇచ్చిన పినాలే మెడల్‌ ఆవు పాల టాస్క్ కోసం ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టి ఆడాలంటూ ఆదేశించారు. టాస్క్‌ పేపర్‌ లో చాలా క్లీయర్‌గా ఏం చేసి అయినా కూడా ఎక్కువ పాలు సంపాదించాలంటూ ఉంది. దాంతో సహజంగానే టాస్క్‌ ఫిజికల్‌ అవుతుంది. అమ్మాయిలు ఉన్నా కూడా అక్కడ ఫిజికల్‌ గా టాస్క్‌ జరిగింది. కాని అవినాష్ మాత్రం చాలా హంగామా చేశాడు.

అఖిల్‌ మరియు సోహెల్‌ లు కలిసి తనను ఆడనివ్వలేదు అని మోనాల్‌ తన్నింది అంటూ రచ్చ చేశాడు. అతడి తీరుతో ఇంటి సభ్యులు అంతా కూడా ఆశ్చర్యపోయారు. అసలు నేను ఆట ఆడనే ఆడను అంటూ లోనికి వెళ్లి పోయాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న పాలను మరియు నీళ్లను తన డబ్బలో పోసుకున్నాడు. తెలివిగా అవినాష్‌ చేసిన పనికి అబ్బా అనుకున్నారు. కాని బిగ్‌ బాస్‌ ఆ పాలను ఒప్పుకోవడం లేదు అంటూ చెప్పడంతో మొదటి రౌండ్‌ లోనే అవినాష్‌ తప్పుకోవాల్సి వచ్చింది. అఖిల్‌.. సోహెల్‌ మరియు హారికలతో జరిగిన ఫైటింగ్‌ లో అవినాష్‌ చాలా ఆవేశంతో రెచ్చిపోయాడు. పదే పదే బిగ్‌ బాస్‌ కు ఫిర్యాదు చేయడంతో పాటు తన అసమర్థతను చూపించే ప్రయత్నం చేశాడు.

తాజా ఎపిసోడ్‌ ఆరంభంలో కూడా సోమవారం తాళూకు చర్చ జరిగింది. మోనాల్‌ను ఎలా నామినేట్‌ చేస్తావు అంటూ అఖిల్‌ ను సోహెల్‌ అడిగాడు. ఆ సమయంలో నా ఇష్టం అంటూ అఖిల్ వాదించాడు. ఆ తర్వాత ఇద్దరి మద్య చాలా సేపు చర్చ జరిగింది. చివరకు ఇద్దరు కలిశారు. అయితే మునుపటి కెమిస్ట్రీ అయితే కనిపించలేదు. హగ్గింగ్‌లు ముద్దులు మాత్రం ఇక ఇద్దరి మద్య ఉండవు అని తేలిపోయింది. మోనాల్‌ ను సోహెల్‌ వెనుక వేసుకున్న తీరు అందరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అఖిల్‌ తో ఆమె గొడవ తీర్చే ప్రయత్నం చేశాడు అదే సమయంలో ఆమెతో గొడవ పడ్డ అరియానా మరియు అవినాష్‌ల వద్దకు వెళ్లి కూడా ఆమె వీక్‌ అనవద్దంటూ విజ్ఞప్తి చేయడం జరిగింది.

సోమవారం ఎపిసోడ్‌ కంటిన్యూషన్‌ తర్వాత రేస్‌ టు ఫినాలే మెడల్‌ టాస్క్‌ ను బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. ప్రతి ఒక్కరు కూడా ప్రాణం పెట్టి ఆడాలంటూ అందులో ప్రత్యేకంగా మెన్షన్‌ చేయడం వల్ల ఇంటి సభ్యులు అంతా కూడా చాలా కష్టపడ్డారు. మొదట అవినాష్‌ తక్కువ పాల బాటిల్స్ ఉండటం వల్ల తప్పుకోగా, ఆ తర్వాత అరియానా తక్కువ పాలు ఉండటం వల్ల తప్పుకుంది. ఆ తర్వాత మోనాల్‌ కూడా తప్పుకుంది. ఇక మిగిలింది అఖిల్‌, అభిజిత్‌, సోహెల్‌ మరియు హారిక. వీరు నలుగురు కూడా తదుపరి ఎపిసోడ్‌ లో మెడల్‌ కోసం పోటీ పడబోతున్నారు.


Advertisement

Recent Random Post:

Hero Suman Shocking Comments On Tirumala Laddu Issue

Posted : September 29, 2024 at 8:00 pm IST by ManaTeluguMovies

Hero Suman Shocking Comments On Tirumala Laddu Issue

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad