Advertisement

వైసీపీ ఎమ్మెల్యేలకు ‘నేనేంటో చూపిస్తా’నంటూ సోము వీర్రాజు వార్నింగ్‌

Posted : December 27, 2020 at 1:20 pm IST by ManaTeluguMovies

ఏపీలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలపై బీజేపీ చీప్‌ సోము వీర్రాజు సీరియస్‌ అయ్యాడు. అధికారులను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆయన స్పందించాడు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను వేదించడం చేస్తే నేనేంటో మీకు ముందు ముందు చూపిస్తానంటూ వైకాపా ఎమ్మెల్యేలను మరియు నాయకులను ఉద్దేశించి సోము వీర్రాజు వార్నింగ్‌ ఇచ్చాడు. గతంలో టీడీపీ నాయకులు కూడా బీజేపీ కార్యకర్తలను భయాందోళనకు గురి చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు వైకాపా నాయకులు కూడా అదే తీరును అవలంభిస్తున్నారు.

అధికారం అనేది అయిదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. తర్వాత పరిస్థితి ఏంటీ అనేది కాస్త జాగ్రత్తగా చూసుకోండి. ఎప్పుడు అధికారంలో ఉంటాము అనుకోవడం తప్పు. కనుక మీరు చేస్తున్న తప్పుడు పనులను వేదింపులను మానుకోవాలి. లేదంటే ముందు ముందు చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఈ సందర్బంగా వైసీపీ ఎమ్మెల్యేలు కు సోము వార్నింగ్ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులను రాష్ట్రంలో వేదిస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాం అంటూ ఆ పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

సిసోడియా కూర్చున్న తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. | CS Sisodia |

Posted : September 14, 2024 at 1:07 pm IST by ManaTeluguMovies

సిసోడియా కూర్చున్న తీరుపై సోషల్ మీడియాలో ట్రోల్స్.. | CS Sisodia |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad