Advertisement

ఆచార్యపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!

Posted : April 9, 2021 at 9:39 pm IST by ManaTeluguMovies

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. రామ్ చరణ్ ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. అయితే.. బ్యాలెన్స్ షూటింగ్ పై చిరంజీవి ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో దర్శకుడికి త్వరగా షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికే రిలీజ్ చేయాలని చెప్పినట్టు ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తోంది.

దీంతో టెంపుల్ సెట్ లో బ్యాలన్స్ షూటింగ్ జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్ పై కొన్ని సన్నివేశాలు, ఒక పాట తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఈరోజే షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నా వచ్చే సోమవారానికి వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సినిమా టీజర్, లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. మే 13న సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో యూనిట్ ఉందని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

KTR Visited Padi Kaushik Reddy House : కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

Posted : September 14, 2024 at 7:15 pm IST by ManaTeluguMovies

KTR Visited Padi Kaushik Reddy House : కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad