Advertisement

‘బిజినెస్ పేరుతో 7.5 కోట్లు మోసం చేశారు’.. సీసీఎస్ లో నటుడు నరేశ్ ఫిర్యాదు

Posted : April 18, 2021 at 10:38 pm IST by ManaTeluguMovies

బిజినెస్‌ విషయంలో కీస్టోస్‌ కంపెనీ తనను మోసం చేసిందని సీనియర్‌ నటుడు నరేశ్‌ అన్నారు. ఈమేరకు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్‌ అనే వ్యక్తి కీస్టోస్‌ కంపెనీ పేరుతో రూ.7.5 కోట్లు మోసం చేసాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కీస్టోన్ ఇన్ఫా కంపెనీల పేరుతో తమ బిల్డర్స్‌తో ఫినిక్స్‌లో లింగం శ్రీనివాస్ అసోసియేట్‌ అయి సైనింగ్‌ అథారిటీగా ఉన్నాడని అన్నారు. తమ కుటుంబంతో ఉన్న పరిచయంతో ఏడున్నర కోట్లు హ్యాండ్‌ ఫైనాన్స్‌ ద్వారా తీసుకొన్నాడని తెలిపారు.

అయితే.. ఆ మొత్తం ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఆరేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవట్లేదన్నారు. అందుకే విసిగిపోయి సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని నరేశ్ చెప్పారు. తనను నమ్మించి బిజినెస్ లో మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. నరేశ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Advertisement

Recent Random Post:

Super Star Rajinikanth Discharged From Hospital in Chennai |

Posted : October 4, 2024 at 2:11 pm IST by ManaTeluguMovies

Super Star Rajinikanth Discharged From Hospital in Chennai |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad