Advertisement

ముంబైలో ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటున్న రష్మిక మందన్న

Posted : July 14, 2021 at 6:56 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ గా అగ్ర స్థానానికి చేరుకుంది రష్మిక మందన్న. ఇక ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది. హిందీలో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను చేస్తోన్న రష్మిక, అమితాబ్ తో కలిసి గుడ్ బై సినిమాలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

త్వరలోనే మరో రెండు బాలీవుడ్ చిత్రాలను అనౌన్స్ చేస్తానని తెలిపింది ఈ భామ. బాలీవుడ్ లో అవకాశాలు పెరుగుతుండడంతో ముంబైలో ఒక ఇల్లు తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే ముంబైలో ఒక ఫ్లాట్ లో ఉంటోంది. అయితే అది కొన్నది కాదు, రెంట్ కు ఉంటోంది.

కానీ తన హిందీ సినిమా రెమ్యునరేషన్లతో ముంబైలో ఒక ఇల్లు తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. అమ్మడి స్పీడ్ చూస్తుంటే త్వరలోనే అది జరిగేలా కనిపిస్తోంది.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 27th April 2024

Posted : April 27, 2024 at 10:41 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 27th April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement