Advertisement

చిరుతో కలిసి జగన్ ను కలిసేందుకు ముందుకు రానున్న మహేష్, బన్నీ

Posted : September 1, 2021 at 12:17 pm IST by ManaTeluguMovies

ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరల వ్యవహారం సినిమా ఇండస్ట్రీకి పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతమున్న టికెట్ ధరలతో పెద్ద సినిమాలు విడుదల కావడం అనేది దాదాపు అసాధ్యం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా వ్యవహరిస్తోన్న చిరంజీవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 4న జగన్, చిరు అండ్ కో కు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే యాక్టివ్ నిర్మాతల గిల్డ్ సభ్యులతో చిరంజీవి చర్చలు జరిపాడు. మీటింగ్ లో మాట్లాడాల్సిన అంశాలను ప్రస్తావించాడు.

ఇక ఇప్పుడు 4న మీటింగ్ కు తనతో పాటు మహేష్, బన్నీలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. పెద్ద స్టార్స్ ఉంటే మీటింగ్ కు ఇంకా వెయిట్ వస్తుందని చిరు భావిస్తున్నాడు. అయితే ఇద్దరూ వస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ ఇద్దరిలో ఒకరు కచ్చితంగా హాజరవుతారని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

ఆధారాల ధ్వంసానికి అనేక ప్రయత్నాలు | IPS officers Many Attempts to Destroy Evidence | Jethwani Case

Posted : September 20, 2024 at 1:16 pm IST by ManaTeluguMovies

ఆధారాల ధ్వంసానికి అనేక ప్రయత్నాలు | IPS officers Many Attempts to Destroy Evidence | Jethwani Case

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad