Advertisement

విజయసాయి బాధితుల కోసం టోల్‌ఫ్రీ నెంబర్ పెట్టాలి

Posted : September 6, 2021 at 12:47 pm IST by ManaTeluguMovies

వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పై అదే పార్టీకి చెందిన రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణమ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. విశాఖ పట్నంలో విజయసాయి రెడ్డి భూ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆరోపించాడు. వందల కోట్ల రూపాయల విలువ చేసే భూములను ఆయన ఆక్రమిస్తున్నాడు అంటూ రఘురామ ఆరోపించాడు. తనకు ఎంతో మంది విజయసాయి రెడ్డి తమ భూములను ఆక్రమించాడు అంటూ కాల్స్ చేస్తున్నారని రఘురామ పేర్కొన్నాడు. ఆయన బాధితుల కోసం ఒక టోల్‌ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేయాల్సిందే అంటూ ఎద్దేవ చేశాడు.

విశాఖ పట్నంలో స్థలాలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే వారి స్థలాలు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది అంటూ ఈ సందర్బంగా విజయసాయి రెడ్డి ని ఉద్దేశించి రఘురామ కృష్ణమ రాజు ఆరోపించాడు. పెద్ద ఎత్తున విజయసాయి రెడ్డి భూ దందా నిర్వహిస్తున్న నేపథ్యంలో వైజాగ్ లో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని రఘురామ కృష్ణమరాజు ఆరోపించాడు. గత కొన్ని రోజులుగా రఘురామ సొంత పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు పీక్స్ కు చేరాయి.


Advertisement

Recent Random Post:

Telangana : మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షతో వేడెక్కిన రాజకీయం

Posted : July 2, 2024 at 11:46 am IST by ManaTeluguMovies

Telangana : మోతీలాల్ నాయక్ నిరాహార దీక్షతో వేడెక్కిన రాజకీయం

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement