Advertisement

బిగ్ బాస్ తెలుగు-5 : నాగ్‌ ఎంట్రీతో హౌస్ లో కొత్త కనెక్షన్స్‌ – ఎపిసోడ్- 7

Posted : September 12, 2021 at 1:16 pm IST by ManaTeluguMovies

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చింది. శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఒక ఆట ఆడించాడు. ఎవరికి ఎవరు సెట్‌ అయ్యారు.. ఎవరు ఎవరితో కట్‌ అయ్యారు అంటూ అడిగాడు. ఆ సమయంలో ఇంటి సభ్యులు ఒకొక్కరిగా ముందుకు వచ్చి తమకు సెట్ అయిన వారికి తమ పేరుతో ఉన్న బ్యాండ్‌ ను వేశారు. కట్ అయిన వారి ఫొటోను చింపి పక్కన ఉన్న డస్ట్ బిన్ లో పడేశారు. మొత్తానికి సెట్ కట్‌ అనే టాస్క్ చాలా సీరియస్‌ గా కొందరి విషయంలో సిల్లీగా కొందరు సీరియస్ గా చేశారు. మొత్తానికి నాగార్జున రాకతో మరింత క్లారిటీ హౌస్ లో ఉన్న విషయం స్పష్టం అయ్యింది. చాలా మంది చాలా రకాలుగా ఇంటి సభ్యుల గురించి అనుకుంటున్నారు. వారాంతంలో నాగార్జున వచ్చిన సమయంలోనే వారి మనసులో మాటలు బయటకు వస్తాయి. అనుకున్నట్లుగానే శనివారం ఎపిసోడ్ లో ఆ విషయం కనిపించింది.

నాగార్జున మొదట ఒకొక్క ఇంటి సభ్యులతో మాట్లాడుతూ కొందరిని సరదాగా ఆట పట్టిస్తే కొందరి విషయంలో కాస్త సీరియస్ అయ్యాడు. మొదటే ఈ వారం మొదటి వారం కనుక ఈసారి ఎక్కువగా కడిగి పారేయాలనుకోవడం లేదు అంటూ తేల్చి చెప్పాడు. అన్నట్లుగానే బిగ్‌ బాస్‌ హౌస్ లో ఉన్న వారి విషయంలో కొందరి పై కోపం ఉన్నా కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించాడు. సిరికి మొదటి క్యాప్టన్ అయినందుకు అభినందించాడు. గొడవలు మాన్పించేందుకు రవి చేస్తున్న ప్రయత్నం ను కూడా నాగ్‌ అభినందించాడు. ఇక అందరిలాగే లోబో ను ఎంటర్ టైనర్ ఆఫ్‌ ది హౌస్‌ అంటూ నాగార్జున కూడా డిక్లైర్‌ చేశాడు. మొత్తానికి కంటెస్టెంట్స్ అందరిపై కూడా చాలా పాజిటివ్‌ గా స్పందించాడు. షణ్ముఖ్‌ జశ్వంత్‌ తో సరదాగా మాట్లాడుతూ అరె ఏంట్రా ఇది అంటూ మాట్లాడమంటూ సూచించాడు. కనిపించడం లేదు అంటూ కొందరు ఆయన్ను ట్రోల్‌ చేస్తుండగా నాగార్జున అదే అన్నాడు.

ఇక ఉమాదేవి మరియు ప్రియాంకల మద్య జరిగిన గొడవ విషయంలో కూడా చాలా కూల్ గా నాగార్జున వారితో మాట్లాడాడు. వారిద్దరు పూర్తిగా ఫ్రెండ్స్ మాదిరిగా అయ్యారు. తనకు సెట్‌ అయ్యింది ప్రియాంక అంటూ ఉమాదేవి చాలా తెలివిగా తన బ్యాండ్‌ ను ప్రియాంకకు ఇవ్వడం జరిగింది. తద్వార ఉమాదేవిపై ఉన్న కోపం పోయింది. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే ఈ వారం నామినేట్‌ అయిన వారిలో రవి మరియు హమీదా లు సేఫ్‌ అయ్యారు. ఇంకా జెస్సీ, మానస్‌, సరయు మరియు కాజల్‌ లు ఉన్నారు. ఈ నలుగురిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనేది సస్పెన్స్ గా ఉంచారు. అయితే ఇప్పటికే సరయు ఎలిమినేట్‌ అయ్యిందని సమాచారం అందుతోంది. కాజల్ మరియు సరయులకు అతి తక్కువ ఓట్ల పడ్డాయి. సరయుతో పోల్చితే కాజల్‌ కు స్వల్పంగా ఓట్లు ఎక్కువ వచ్చాయి. కనుక ఆమెను ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా నాగార్జున ఆదివారం ఎపిసోడ్‌ లో ప్రకటించబోతున్నాడు.


Advertisement

Recent Random Post:

YS Bharathi Election Campaign : ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణి

Posted : April 30, 2024 at 1:49 pm IST by ManaTeluguMovies

YS Bharathi Election Campaign : ఎన్నికల ప్రచారంలో సీఎం సతీమణి

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement