Advertisement

పూర్తిగా కోలుకున్న సాయి తేజ్.. డిశ్చార్జ్ ఎప్పుడంటే..?

Posted : September 21, 2021 at 12:43 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తేజ్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సాయి తేజ్ స్పృహలోనే ఉన్నారని.. లేకుండానే శ్వాస తీసుకుంటున్నారని వైద్య బృందం సోమవారం వెల్లడించింది.

సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నారని.. మూడు రోజుల కిందటే ఆయన్ను ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మార్చామని వైద్యులు వెల్లడించారు. సొంతంగానే శ్వాస తీసుకుంటున్న తేజ్.. అందరితో బాగానే మాట్లాడగలుగుతున్నారని తెలిపారు. అంతేకాదు రెండు మూడు రోజుల్లోనే సాయి తేజ్ ను డిశ్చార్జ్ కూడా చేసే అవకాశం ఉందని తెలియజేసారు. యువ హీరో పూర్తిగా కొలుకున్నాడనే న్యూస్ తెలియడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ – ఐకియా సమీపంలో సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి సాయి ధరమ్ తేజ్ స్పోర్ట్స్ బైక్ పై ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన తేజ్ ను ముందుగా దగ్గరలోని మెడికవర్ హాస్పిటల్ కు తీసుకెళ్లి అత్యవసర చికిత్స అందించారు. ఈ క్రమంలో మెరుగైన వైద్యం కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు. గత పది రోజులుగా జరిగిన చికిత్సతో సాయి తేజ్ కోలుకున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. సాయి తేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో ”రిపబ్లిక్” అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రేపు సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.


Advertisement

Recent Random Post:

AP Elections 2024 || Chiranjeevi పై కొందరు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు : C. M. Ramesh –

Posted : April 25, 2024 at 11:48 am IST by ManaTeluguMovies

AP Elections 2024 || Chiranjeevi పై కొందరు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు : C. M. Ramesh –

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement