Advertisement

సహాయం కోరిన రేణు దేశాయ్.. అడివి శేష్ ఏం చేశారంటే..

Posted : August 13, 2024 at 6:45 pm IST by ManaTeluguMovies

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ అనే మూవీతో పాటు గూఢచారి 2 చిత్రం చేస్తున్నారు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ గా రెడీ అవుతున్నాయి. మేజర్ లాంటి గ్రాండ్ సక్సెస్ తర్వాత అడవి శేష్ పూర్తిగా గూఢచారి 2 మూవీ వర్క్ పైన ఫోకస్ చేశారు. అలాగే శృతి హాసన్ తో జోడీగా డెకాయిట్ అనే చిత్రాన్ని కంప్లీట్ చేశారు. డెకాయిట్ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

వీలైనంత వరకు సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ హీరో కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ అందరితోనూ చాలా ఫ్రెండ్లిగా ఉండేందుకు ప్రయత్నం చేసాడు. అడవి శేష్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. తాజాగా అడివి శేష్ పెట్స్ ఫుడ్ కోసం రేణు దేశాయ్ ఇచ్చిన పిలుపుకి స్పందించి తనవంతుగా సాయం చేశారు.

ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్, సీనియర్ యాక్టర్ రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ సోషల్ సర్వీస్ కి సంబందించిన పబ్లిక్ నుంచి ఫండ్ రైజింగ్ కోసం అభ్యర్దిస్తున్నారు. గతంలో అనాథలకి సాయం కోసం ఆమె అలాగే ఫండ్ రైజ్ చేశారు. రేణు దేశాయ్ పిలుపుకి చాలా మంది రెస్పాండ్ అయ్యి వారికి తోచిన సాయం అందించారు.

తాజాగా మూగ జీవాల కి ఫుడ్ కోసం సాయం చేయాలని రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పెట్టారు. ఎవరికి తోచిన స్థాయిలో వారు సాయం చేయాలని అభ్యర్ధించారు. తాను 50 కేజీల బియ్యం సాయం చేశానని, వీలైనంత ఎక్కువ మంది ముందుకొచ్చి హెల్ప్ చేయాలని రేణు దేశాయ్ రిక్వెస్ట్ చేశారు. దీనిపై హీరో అడివి శేష్ వెంటనే రియాక్ట్ అయ్యి సాయం చేసారంట.

ఈ విషయాన్ని రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు. అతని తరహాలోనే పబ్లిక్ కూడా పెట్స్ ఫీడ్ కోసం ముందుకొచ్చి తోచిన సహాయం చేయాలని రేణు దేశాయ్ వీడియోలో కోరారు. ఆమె అప్పీల్ కి చాలా మంది రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. జంతు ప్రేమికులు ఇలాంటి వాటి కోసం ముందుకొస్తారని భావిస్తున్నారు. రేణు దేశాయ్ షేర్ చేసిన వీడియోని ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే రేణు దేశాయ్ మరల యాక్టర్ గా బిజీ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు. గత ఏడాది రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఆమె కీలక పాత్రలో నటించారు.


Advertisement

Recent Random Post:

భారత్‌ తూటాలతో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి ! | Ukraine Attacked Russia With Indian bullets

Posted : September 20, 2024 at 1:18 pm IST by ManaTeluguMovies

భారత్‌ తూటాలతో రష్యాపై ఉక్రెయిన్‌ దాడి ! | Ukraine Attacked Russia With Indian bullets

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad