Advertisement

బన్నీకి నో, మహేష్ బాబుకే ఓటేసిన అల్లు అరవింద్.!

Posted : April 14, 2020 at 4:02 pm IST by ManaTeluguMovies

‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. పరశురామ్ తో ఎక్కువ భాగం సినిమా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆ సినిమా సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే కానుకగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పక్కన పెడితే.. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడు. కానీ తను కెజిఎఫ్ 2 తో బిజీగా ఉండడం వలన ఈ లోపు మరో సినిమా చేయాలనుకున్నాడు.

మహేష్ బాబు – ప్రశాంత్ నీల్ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాత. అల్లు అరవింద్ కూడా పలుసార్లు మహేష్ తో త్వరలో గీత ఆర్ట్స్ లో సినిమా ఉంటుంది. అనుకున్నట్టుగానే మహేష్ బాబు – ప్రశాంత్ నీల్ మూవీని పాన్ ఇండియా ఫిల్మ్ గా చేయాలని ఫిక్స్ అయ్యారు. కథలో ఇక్కడే చిన్న ట్విస్ట్.. అల్లు అరవింద్ సన్నిహితులు, ఎందుకు మహేష్ తో వీలైతే ఆ ప్రాజెక్ట్ బన్నీ తోనే సెట్ చేయచ్చు కదా అని అన్నారు. కానీ అల్లు అరవింద్ మాత్రం ఎవరు ఎన్ని చెప్పినా తన ప్లాన్ ప్రకారం మహేష్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యాడట.

అల్లు అర్జున్ మంచి బిజినెస్ మెన్ కూడా కాబట్టి మార్కెట్ పరంగా అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా సుకుమార్ చెప్పిన ‘100% లవ్’ స్టోరీ వినగానే నేను చేస్తా అన్న బన్నీని ఆపి ఆ సినిమా నాగ చైతన్యతో చేసాడు. సో కచ్చితంగా అల్లు అర్జున్ కోసం బెటర్ పాన్ ఇండియా ఫిల్మ్ ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. అందుకే అల్లు అరవింద్ ఎవరికోసం అనుకున్న కాంబినేషన్ ని వారితోనే ఫిక్స్ అయ్యాడట.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 19th September 2024

Posted : September 19, 2024 at 10:23 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 19th September 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad