Advertisement

అల్లు అర్జున్ మరో ఘనత.. 25మంది అత్యంత ప్రతిభావంతుల్లో స్థానం

Posted : February 13, 2021 at 10:12 pm IST by ManaTeluguMovies

‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో ‘బుట్ట బొమ్మ’ పాటతో దేశం మొత్తం క్రేజ్ సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. దక్షిణాదిన ఎంత క్రేజ్ ఉందో ఆస్థాయిలో క్రేజ్ దక్కింది. ఇప్పుడు అల్లు అర్జున్ మరో జాతీయస్థాయి కీర్తి దక్కించుకున్నాడు. ప్రతిష్టాత్మక జీక్యూ ఇండియా దేశంలోని వివిధ రంగాలలో అత్యంత ప్రభావవంతులైన 25 మంది యువ భారతీయుల జాబితా రూపొందించింది. ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థానం దక్కించుకోవడం విశేషం.

‘మార్పు తీసుకురాగలిగే వ్యక్తులు’గా పరిగణిస్తూ GQ ఇన్నోవేటర్లు, ఎంటర్టైనర్స్, డిస్ట్రప్టర్స్, గేమ్-ఛేంజర్స్ అంటూ ఓ జాబితాను రూపొందించింది. వీరిలో అల్లు అర్జున్ తోపాటు క్రికెటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, పాపులర్ కమెడియన్ డానిష్ సైట్, నటి అనుష్క శర్మ ఉన్నారు. బుట్ట బొమ్మ, రాములో.. రాములా.. పాట‌లు ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. దేశంలోని యువత ఈ పాటలకు ఊగిపోయింది. యూట్యూబ్ లో 2020 టాప్ 10 మ్యూజిక్ వీడియోలలో స్థానం సంపాదించాయి


Advertisement

Recent Random Post:

తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు |CM Chandrababu Sensational Comments on Tirumala Laddu

Posted : September 19, 2024 at 11:42 am IST by ManaTeluguMovies

తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు |CM Chandrababu Sensational Comments on Tirumala Laddu

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad