Advertisement

బన్నీ నిర్ణయంతో మైత్రి వారి అసంతృప్తి?

Posted : July 8, 2021 at 9:05 pm IST by ManaTeluguMovies

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా లెవెల్లో చేస్తోన్న చిత్రం పుష్ప. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగింది. పుష్పను రెండు భాగాల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. మొదటి భాగం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఫస్ట్ పార్ట్ ఈ ఏడాదే విడుదల కానుంది.

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తాజాగా తీసుకున్న నిర్ణయం కారణంగా మైత్రి మూవీ మేకర్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 పూర్తైన తర్వాత కొంత బ్రేక్ తీసుకుని ఐకాన్ చిత్రాన్ని మొదలుపెట్టాలని బన్నీ భావిస్తున్నాడు.

అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం ఎలాంటి బ్రేక్ లేకుండా పుష్ప పార్ట్ 2 కూడా పూర్తి చేయాలని భావిస్తోంది. అలా అయితే తమకు ఫైనాన్షియల్ గా భారం ఉండదని, బిజినెస్ కూడా బాగా జరుగుతుందని అనుకుంటోంది. మరి బన్నీ తన నిర్ణయాన్ని ఏమైనా మార్చుకుంటాడేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

అమిత్ షా పై ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్ | Amit Shah Fake Video Controversy

Posted : April 29, 2024 at 7:29 pm IST by ManaTeluguMovies

అమిత్ షా పై ఫేక్ వీడియో కేసులో తొలి అరెస్ట్ | Amit Shah Fake Video Controversy

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement