Advertisement

రిషికేష్ లో ధ్యానంలో మునిగిపోయిన అమలా పాల్

Posted : April 5, 2021 at 7:32 pm IST by ManaTeluguMovies

సౌత్ ఇండియన్ నటి అమలా పాల్ ప్రస్తుతం భక్తి భావంలో మునిగితేలుతోంది. ఆధ్యాత్మిక కేంద్రమైన రిషికేష్ కు వెళ్లి అక్కడ ధ్యానం చేస్తున్నట్లు ఆమె తెలిపింది. ధ్యానంలో ఉన్న ఆమె ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

కోలీవుడ్ దర్శకుడు విజయ్ ను పెళ్లి చేసుకున్న అమలా పాల్ కొన్నాళ్లకే అతని నుండి విడిపోయింది. ప్రస్తుతం ఆమె ఒంటరిగానే జీవితాన్ని గడుపుతోంది. పెళ్లి తర్వాత నటనకు కామా పెట్టిన అమలా పాల్ తిరిగి సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఆధ్యాత్మికంగా గడపడం చాలా అలవాటు అన్న విషయం తెల్సిందే. ప్రతీ ఏడాది హిమాలయాలకు వెళ్లి రజినీకాంత్ కొన్ని రోజులు ధ్యానం చేసి వస్తూ ఉంటారు. తమిళ నటుడు శింబు కూడా ఈ విషయంలో రజినీను ఫాలో అయ్యారు. తను కూడా హిమాలయాలకు వెళ్లే అలవాటుంది. ఇప్పుడు అమలా పాల్ కూడా ఈ రూట్ నే ఫాలో అవుతోంది.


Advertisement

Recent Random Post:

బోటు ఆపరేషన్ H బ్లాక్ సక్సెస్ | Boat Removal Operation At Prakasam Barrage

Posted : September 18, 2024 at 12:44 pm IST by ManaTeluguMovies

బోటు ఆపరేషన్ H బ్లాక్ సక్సెస్ | Boat Removal Operation At Prakasam Barrage

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad