Advertisement

అనసూయ ‘పక్కా కమర్షియల్‌’లో వ్యేశ్య

Posted : February 16, 2021 at 4:18 pm IST by ManaTeluguMovies

ఈమద్య కాలంలో అనసూయకు నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు తలుపు తడుతున్నాయి. ఇటీవలే చావు కబురు చల్లగా అనే సినిమాలో ఐటెం సాంగ్‌ చేసిన ఈ అమ్మడు తాజాగా మారుతి దర్శకత్వంలో గోపీచంద్‌ హీరోగా రూపొందుతున్న పక్కా కమర్షియల్‌ మూవీలో వేశ్య పాత్రను చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కథలో అత్యంత కీలకమైన ఈ పాత్రకు అనసూయ అయితే ప్రాణం పోస్తుందనే నమ్మకంతో ఆమెను ఎంపిక చేసినట్లుగా చెబుతున్నారు.

దర్శకుడు మారుతి ఫ్యామిలీ తరహా సినిమాలను వరుసగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. అందులో భాగంగానే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ సినిమాలో అనసూయను వేశ్యగా చూపించి ఆమె స్థాయిని మరింతగా పెంచాలని దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇలాంటి పాత్రలకు ఒప్పుకోవడం అంటే ఖచ్చితంగా సాహస నిర్ణయం. అలాంటి సాహసంను అనసూయ చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినందనీయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను అక్టోబర్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నారు.


Advertisement

Recent Random Post:

Dy CM Pawan Kalyan and Prakash Raj clash over Tirupati Laddu Row

Posted : September 26, 2024 at 9:44 pm IST by ManaTeluguMovies

Dy CM Pawan Kalyan and Prakash Raj clash over Tirupati Laddu Row

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad