Advertisement

ఏనుగు మృతిపై తీవ్రంగా స్పందించిన హాట్‌ యాంకర్‌

Posted : June 3, 2020 at 7:09 pm IST by ManaTeluguMovies

కేరళలో గర్బంతో ఉన్న ఏనుగుకు పైన్‌ ఆపిల్‌లో క్రాకర్స్‌ పెట్టి తినిపించి వాటిని పేల్చిన సంఘటన ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. గర్బంతో ఉన్న ఆ ఏనుగు నొప్పి భరించలేక ఒక నదిలోకి వెళ్లి దాదాపు నాలుగు గంటల పాటు అలాగే ఉండి చివరకు ప్రాణాలు వదిలింది. ఆ ఏనుగు కడుపులో ఉన్న పిల్ల ఏనుగు ఎంతగా రోధించిందో అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఈ సమయంలో జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ కూడా ఏనుగు మృతిపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.

ఏనుగు మృతికి కారకులు అయిన వారిని తీవ్రంగా శిక్షించాలంటూ జంతు ప్రేమికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఏనుగు అడవి నుండి జనావాసాల్లోకి వచ్చినా కూడా గుర్తించని అధికారులను కూడా శిక్షించాలంటూ నెటిజన్స్‌ ట్వీట్స్‌ చేస్తున్నారు. తాజాగా అనసూయ ఈ విషయంలో స్పందిస్తూ… ఇప్పటికే మనం మరణంకు దగ్గర్లో ఉన్నాం. మనం జీవితంలో ఎన్నో తప్పులు చేస్తూ జీవితాన్నే చెత్తగా చేసుకుంటున్నాం. ఇలాంటి సమయంలో మనుషులు కొందరు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడటం దారుణం.

అడవి, అడవిలో ఉండే జంతువులు దైవత్యవంతో సమానం. అలాంటి దైవాల పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిని ఏం చేసినా తప్పు లేదు. ఈ సంఘటన తెలిసినప్పటి నుండి చాలా వేదనకు గురి అయ్యాను. ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. నా మనసు తీవ్ర అల్ల కల్లోలంకు గురయ్యిందని అనసూయ పేర్కొంది.
https://www.instagram.com/p/CA-KY2nlZf2/


Advertisement

Recent Random Post:

Balineni Srinivas Reddy Meeting Deputy CM Pawan Kalyan | పవన్ చేతిలో బాలినేని భవిష్యత్? | JSP

Posted : September 19, 2024 at 1:04 pm IST by ManaTeluguMovies

Balineni Srinivas Reddy Meeting Deputy CM Pawan Kalyan | పవన్ చేతిలో బాలినేని భవిష్యత్? | JSP

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad