Advertisement

ఎఫ్‌-3లో మూడో హీరో ఉంటాడా అనడిగితే..

Posted : April 12, 2020 at 2:28 pm IST by ManaTeluguMovies

గ‌త ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టి ఎఫ్‌-2. విక్ట‌రీ వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శ‌క‌త్వంలో దిల్ రాజు మీడియం బ‌డ్జెట్లో తీసిన‌ ఆ సినిమా ఏకంగా రూ.80 కోట్ల షేర్ క‌లెక్ట్ చేసి సంచ‌ల‌నం సృష్టించింది. దీనికి సీక్వెల్ తీస్తామ‌ని అప్పుడే అనిల్‌తో పాటు నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

స‌రిలేరు నీకెవ్వ‌రు త‌ర్వాత అనిల్ చేయ‌బోయే సినిమా ఇదే అని కూడా ఖ‌రారైపోయింది. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ పిలుపుకు స్పందిస్తూ దీపాలు వెలిగించే టాస్క్‌ను ఎఫ్‌-3 ర‌చ‌యిత‌ల బృందంతో క‌లిసే చేశాడు. అత‌ను ఎఫ్‌-3 మీద ప‌ని చేస్తున్న సంగ‌తి అప్పుడే ఖ‌రారైంది. తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా ఎఫ్‌-3 గురించి మ‌రిన్ని విష‌యాలు చెప్పాడు అనిల్.

త‌న స్వ‌స్త‌లం అయిన ప్ర‌కాశం జిల్లా చిల‌కూరివారిప‌ల్లెలోనే త‌న రైటింగ్ టీంతో క‌లిసి ఎఫ్‌-3 మీద ప‌ని చేస్తున్న‌ట్లు అనిల్ వెల్ల‌డించాడు. ఈ సినిమా ఎలా సాగుతుంద‌ని అడిగితే.. ‘‘మోర్ ఫ‌న్ అన్న‌దానికి సంకేత‌మే మూడో ఎఫ్‌. ఎఫ్‌-2 న‌చ్చిన‌వాళ్లు మ‌రింత ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది. ఓ విభిన్న క‌థ‌తో ఈ సినిమా చేస్తున్నాం. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌ల‌తో పాటు త‌మ‌న్నా, మెహ్రీన్ ఇందులోనూ ఉంటారు. ఈ సారి పెళ్లి గురించి కాకుండా వేరే అంశం మీద క‌థ నడుస్తుంది అని అనిల్ చెప్పాడు .

మ‌రి సినిమాలో మూడో హీరో ఉంటాడ‌న్న ప్ర‌చారం సంగ‌తేంటి అని అడిగితే.. ‘‘ఈ క‌థ‌లో మ‌రో హీరోకు చోటు ద‌క్కేలా క‌నిపించ‌డం లేదు. ఒక‌వేళ సెకండాఫ్‌లో ఏమైనా అవ‌కాశం ఉందంటే అప్పుడు ఆలోచిస్తాం. ఆ విష‌యం చివ‌రి వ‌ర‌కు మాక్కూడా స‌స్పెన్సే’’ అని అనిల్ తెలిపాడు.


Advertisement

Recent Random Post:

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Posted : May 2, 2024 at 10:06 pm IST by ManaTeluguMovies

తెలుగు రాష్ట్రాల గురించి మోదీ చెప్పింది ఇదే..!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement