Advertisement

ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Posted : June 16, 2020 at 12:31 pm IST by ManaTeluguMovies

ప్రత్యేక పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. కొద్దిసేపటి కిందట కేబినెట్ భేటీ జరిగింది. బడ్జెట్ కు ఇందులో ఆమోదం తెలిపారు. కరోనా లాంటి ప్రత్యేక పరిస్థితుల మధ్య జరుగుతున్న ఈ బడ్జెట్ సమావేశాల్ని కేవలం 2 రోజులకు కుదిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అటు గవర్నర్ కూడా తన ప్రసంగాన్ని ఆన్ లైన్ ద్వారా పూర్తిచేస్తున్నారు.

గవర్నర్ ప్రసంగం తర్వాత ఆర్థిక మంత్రి బుగ్గన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆ వెంటనే వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి కన్నబాబు సమర్పిస్తారు. మండలిలో ఈ కార్యక్రమాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పూర్తిచేయబోతున్నారు.

ప్రత్యేక పరిస్థితుల కారణంగా మధ్యాహ్నం 3 గంటల్లోపు ఇవాళ్టి సమావేశాల్ని పూర్తిచేయాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం అనుకున్న విధంగా సమావేశాలు కొనసాగుతాయనే నమ్మకం తక్కువగానే ఉంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు, జేసీ అరెస్టులు, ఎల్జీ పాలిమర్స్ లాంటి అంశాలపై ఆందోళనకు దిగాలని టీడీపీ నిర్ణయించింది. మరీ ముఖ్యంగా అచ్చెన్నాయుడు అరెస్ట్ పై ఆందోళన చేయాలని నిర్ణయించిన టీడీపీ.. దానిపై ప్రత్యేక చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది.

ఇప్పటికే నల్లచొక్కాలు వేసుకొని సమావేశాలకు హాజరైన టీడీపీ సభ్యులు.. ఆందోళన చేయడానికే మొగ్గుచూపుతున్నారు.


Advertisement

Recent Random Post:

CM YS Jagan: సీఎం జగన్‌ నేటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..!

Posted : May 4, 2024 at 12:30 pm IST by ManaTeluguMovies

CM YS Jagan: సీఎం జగన్‌ నేటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..!

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement