టాలీవుడ్ సెలబ్రెటీలు క్వారెంటైన్ టైంను ఏవో ఛాలెంజ్ల పేరుతో టైం పాస్ చేస్తున్నారు. ఈమద్య హీరోలు బి ది రియల్ మ్యాన్ అనే ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. ఈ ఛాలెంజ్లో ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి, సుకుమార్, కొరటాల శివ, వెంకటేష్లతో పాటు పలువురు స్టార్స్ ఈ ఛాలెంజ్ను స్వీకరించి ఇప్పటికే ఇంటి పనులు చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం అందరి దృష్టి బాలకృష్ణ మరియు మహేష్బాబులపై ఉంది.
ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ను స్వీకరించి బాబాయి బాలకృష్ణను ఛాలెంజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక వెంకటేష్ ఈ ఛాలెంజ్ను స్వీకరించి మహేష్బాబును ఛాలెంజ్ చేశాడు. వీరిద్దరు ఈ ఛాలెంజ్లను స్వీకరించేది లేనిది ఇప్పటి వరకు స్పందించలేదు. త్వరలోనే వీరిద్దరు కూడా తప్పకుండా ఛాలెంజ్ను స్వీకరిస్తారని అంతా నమ్మకంగా ఉన్నారు. కాని వీరిద్దరు మాత్రం ఇలాంటి వ్యవహారాలపై ఆసక్తి చూపరని, వీరిద్దరు ఈ ఛాలెంజ్ను లైట్ తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ ఛాలెంజ్ను నాగార్జున ఇప్పటి వరకు పట్టించుకోలేదు. అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ ఛాలెంజ్ పట్ల ఆసక్తిని చూపిస్తున్నట్లుగా లేడు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ ఛాలెంజ్ను వారు ఎలా చేస్తారా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ను కూడా ఎవరో ఒకరు ఈ ఛాలెంజ్కు ఆహ్వానించే అవకాశం ఉంది. కాని ప్రభాస్ కూడా ఈ ఛాలెంజ్ను స్వీకరించేందుకు ఆసక్తి చూపించక పోవచ్చు అంటున్నారు. మొత్తానికి ఈ ఛాలెంజ్తో మొహమాటస్తు ఎవరు.. చిల్గా ఉండేవారు ఎవరు అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.