Advertisement

రాష్ట్రంలో రాక్షస పాలన.. రైతులను ఆదుకోకపోతే ఉద్యమిస్తాం: బాలకృష్ణ

Posted : January 6, 2021 at 7:13 pm IST by ManaTeluguMovies

రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రైతులు వెన్ను విరుస్తోందని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు.

గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను పరిశీలించారు. రైతులను ఆదుకోకపోతే రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతులకు ఇన్ పుట్ సబ్సీడీతోపాటు దెబ్బతిన్న పంటలను గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. తెలుగుదేశం దేవత అయితే.. వైసీపీ రాక్షసులని బాలకృష్ణ అన్నారు. రైతులను రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీ హయాంలో ప్రభుత్వం రైతులను ఆదుకుందని అన్నారు. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. స్థానికులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.


Advertisement

Recent Random Post:

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Posted : April 28, 2024 at 7:34 pm IST by ManaTeluguMovies

Dialogue War : CM Revanth Reddy Vs Etela Rajender

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement