Advertisement

చంద్రబాబు కావాలన్నా ఇళ్ల పట్టా ఇస్తాం

Posted : December 30, 2020 at 1:36 pm IST by ManaTeluguMovies

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల కోసం ఇళ్లు ఇస్తుంటే తెలుగు దేశం పార్టీ నాయకులు అక్కస్సు వెళ్లగక్కుతున్నారు అంటూ వైకాపా నాయకులు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

చిత్తూరు జిల్లా కార్వేనగరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు తెలుగు దేశం పార్టీ నాయకులపై మరియు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై అసహనం వ్యక్తం చేశాడు.

ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ది పనులు చూసి ఓర్వలేక ఇలా విమర్శలు చేస్తున్నారు. పేదలకు ఇళ్లు వస్తుంటే తట్టుకోలేక పోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన కావాలంటే ఆయనకు కూడా ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు సిద్దంగా ఏపీ ప్రభుత్వం ఉంది.. ఆయన చిన్న దరకాస్తు పెట్టుకుంటే చాలు పార్టీ ఏదీ అనేది కూడా చూడకుండా ఇళ్ల పట్టాలు ఇస్తామంటూ పేర్కొన్నాడు.

ఇళ్ల పట్టాల విషయాన్ని రాజకీయం చేసి లబ్ది పొందేందుకు తెలుగు దేశం పార్టీ భావిస్తుందని నారాయణ స్వామి పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

Dhee Celebrity Special 2 Latest Promo – 18th & 19th September 2024 – Wed & Thur @9:30 PM – Hansika

Posted : September 16, 2024 at 3:06 pm IST by ManaTeluguMovies

Dhee Celebrity Special 2 Latest Promo – 18th & 19th September 2024 – Wed & Thur @9:30 PM – Hansika

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad