Advertisement

డ్రగ్స్‌ కేసు : బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌కు ఎన్‌సీబీ నోటీసులు..?

Posted : September 22, 2020 at 12:25 pm IST by ManaTeluguMovies

సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు మొత్తం బాలీవుడ్‌ ప్రముఖులను డ్రగ్స్‌ కేసులోకి లాగేట్లుగా ఉంది. కంగనా ఆరోపిస్తున్నట్లుగా బాలీవుడ్‌లో ఎంతో మంది ప్రముఖులు డ్రగ్స్‌ వాడుతున్నారని.. ప్రతి పార్టీలో కూడా డ్రగ్స్‌ అనేవి చాలా కామన్‌ అయ్యాయి అంటూ ఆమె చెప్పింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు శోవిక్‌ చక్రవర్తిలు అరెస్ట్‌ అయ్యారు. డ్రగ్స్‌ కేసును లోతుగా ఎంక్వౌరీ చేస్తున్న ఈ సమయంలో పలువురు ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ప్రముఖ జాతీయ వార్తా సంస్థ ఈ కేసులో ఎన్‌ సీ బీ వారు త్వరలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునేకు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా తన కథనంలో పేర్కొంది. విచారణకు దీపిక హాజరు కావాల్సి ఉంటుందని సదరు వార్త కథనంలో రాయడంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ వర్గాలతో పాటు దేశ వ్యప్తంగా సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు. బాలీవుడ్‌లోనే కాకుండా దేశంలోనే నెం.1 హీరోయిన్‌ గా దీపిక పదుకునే నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక పారితోషికం తీసుకుంటూ స్టార్‌ హీరోలను సైతం వెనక్కు నెట్టిన ఈ అమ్మడు ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుండటం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తుంది.

డ్రగ్స్‌ కేసులో దీపిక పదుకునే మాత్రమే కాకుండా సారా అలీ ఖాన్‌.. శ్రద్దా.. కరిష్మా.. సిమోన్‌ లకు కూడా ఎన్‌సీబీ సమన్లు జారీ చేసే అవకాశం ఉందని జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నేడు వీరికి సమన్లు జారీ చేసి వెంటనే విచారించే అవకాశం ఉందని.. విచారణలో మరింత మంది పేర్లు వస్తాయనే అభిప్రాయంను ఎన్‌ సీ బీ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారట. ఈ వ్యవహారంలో టాలీవుడ్‌ కు చెందిన వారు కూడా ఒకరు ఇద్దరు ఉన్నారు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 


Advertisement

Recent Random Post:

CM YS Jagan Stone Incident Case :సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్‌

Posted : April 21, 2024 at 7:06 pm IST by ManaTeluguMovies

CM YS Jagan Stone Incident Case :సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్‌

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement