Advertisement

మళ్లీ బాలీవుడ్‌లో డ్రగ్స్‌ రచ్చ… చిక్కుల్లో దీపిక పదుకునే

Posted : October 29, 2020 at 3:58 pm IST by ManaTeluguMovies

బాలీవుడ్‌ స్టార్స్‌ డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే డ్రగ్స్‌ కేసులో విచారణ ఎదుర్కొనడం చర్చనీయాంశం అయ్యింది. విచారణ తర్వాత ఏం జరిగింది అనే విషయం పై క్లారిటీ లేదు. మెల్లగా ఆ డ్రగ్స్‌ కేసు కనుమరుగు అవుతుంది అనుకుంటున్న సమయంలో మరోసారి బాలీవుడ్‌ లో డ్రగ్స్‌ చర్చ మొదలైంది. దీపిక పదుకునే మేనేజర్‌ అయిన కరిష్మా ప్రకాస్‌ ఇంట్లో పోలీసులు డ్రగ్స్‌ ను స్వాదీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా కరిష్మా ఇంటిపై నిఘా పెట్టిన పోలీసులు ఇప్పుడు ఆ విషయమై ఎంక్వౌరీ చేయగా ఆమె వద్ద డ్రగ్స్‌ పట్టుబడ్డాయి.

ఎన్సీబీ అధికారులు ఆమెను మరోసారి అదుపులోకి తీసుకోబోతున్నారు. ఆమెకు ఆ డ్రగ్స్‌ ఎక్కడి నుండి వచ్చాయి అనే విషయంలో ఎంక్వౌరీ చేస్తున్నారు. కరిష్మా ఇంటి నుండి డ్రగ్స్‌ ను స్వాదీనం చేసుకున్న అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె లేదు. దాంతో ఆమె ఇంటికి నోటీసులు అంటించారు. ఆమెను విచారణకు హాజరు అవ్వాలంటూ ఇంటి వద్ద నోటీసులు అంటించారు. ఈ కేసు విషయంలో దీపిక పదుకునే మళ్లీ ఏమైనా విచారణకు హాజరు అవ్వాల్సి ఉంటుందా అనేది చూడాలి. డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న హీరోయిన్‌ దీపిక పదుకునే మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందేమో అంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Andhra Ranam : ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ అడ్డా

Posted : May 16, 2024 at 11:34 am IST by ManaTeluguMovies

Andhra Ranam : ఆళ్లగడ్డ ఫ్యాక్షన్ అడ్డా

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement