Advertisement

కిషన్‌ రెడ్డి పెదన్నఅనారోగ్యంతో మృతి

Posted : April 22, 2021 at 3:08 pm IST by ManaTeluguMovies

బీజేపీ సీనియర్ నాయకుడు.. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన పెద్దన్న యాదగిరి రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంత కాలంగా యాదగిరి రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు. యాదగిరి రెడ్డి మృతి వార్త తెలిసి వెంటనే కిషన్‌ రెడ్డి హుటా హుటిన స్వస్థలంకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది.

రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్‌లోని తన నివాసంలో యాదగిరి రెడ్డి మృతి చెందారు. గత రాత్రి మృతి చెందిన యాదగిరి రెడ్డి ని పరామర్శించేందుకు పలువురు ప్రముఖ నాయకులు తిమ్మాపూర్‌ చేరుకుంటున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో నేడు సాయంత్రం వరకు యాదగిరి రెడ్డి అంత్య క్రియలను పూర్తి చేయబోతున్నట్లుగా కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


Advertisement

Recent Random Post:

తెదేపాలోకి భారీ సంఖ్యలో వైకాపా నాయకుల చేరికలు | YCP Leaders Joins In TDP Party

Posted : April 23, 2024 at 9:15 pm IST by ManaTeluguMovies

తెదేపాలోకి భారీ సంఖ్యలో వైకాపా నాయకుల చేరికలు | YCP Leaders Joins In TDP Party

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement