Advertisement

మహిళలకు ధైర్యం నూరిపోస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Posted : May 24, 2020 at 11:46 am IST by ManaTeluguMovies

మ‌హిళ‌ల‌కు ధైర్యం నూరిపోస్తున్నారు బాలీవుడ్ బ్యూటీ కృతీ స‌న‌న్‌. లాక్‌డౌన్‌లో మ‌హిళ‌ల‌పై గృహ హింస పెర‌గ‌డాన్ని ఆమె త‌ప్పు ప‌డుతున్నారు. మ‌హిళ‌ల్లో చైతన్యం పెర‌గాల‌ని ఆమె ఉద్బోధిస్తున్నారు. మ‌హిళ‌లపై సాగుతున్న హింస‌పై ఆమె నిల‌దీస్తున్నారు, ప్ర‌శ్నిస్తున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌హిళ‌ల‌కు సంబంధించి అనేక విష‌యాలు ఆమె చెప్పారు.

‘మహిళల్ని… ఆ మాటకొస్తే ఒకరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. మానసికంగానైనా, శారీరకంగానైనా! మహిళలు ఎవరైనా గృహహింసను ఎందుకు సహించాలి? భరించాలి? ఈ పరిస్థితి మారాలి. వెంటనే మార్పు రావాలి’ అని కృతీ స‌న‌న్‌ అంటున్నారు .

‘లాక్‌డౌన్‌ కాలంలో సుమారు 35 నుంచి 40 శాతం వరకూ గృహహింస కేసులు పెరిగాయని వార్తల్లో చదివా. పంజాబ్‌ రాష్ట్రంలోనే 700 కేసులు ఉన్నాయట. ఈ దారుణాలకు వ్యతిరేకంగా మహిళలు ధైర్యంగా నిలబడాలి. ముందుకు రావడానికి భయపడుతున్నారని అర్థం చేసుకోగలను. అయితే, ధైర్యంగా నిలబడి సరైన నిర్ణయం తీసుకొంటే, అది వాళ్ల జీవితాన్ని అందంగా మారుస్తుంది. నేను ఈ విషయం గురించి మాట్లాడడం వల్ల గృహహింసలో చిక్కుకున్న ఒక్క మహిళ అయినా స్ఫూర్తి పొందితే సంతోషిస్తా’ అన్నారు కృతి.

ఇటీవ‌ల సామాజిక, మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై హీరోయిన్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా గొంతు విప్పుతున్నారు. సినీ సెల‌బ్రిటీల్లో వ‌చ్చిన ఈ మార్పు ఆహ్వానించ‌ద‌గ్గ‌దే. ఈ ర‌కంగానైనా మ‌హిళ‌ల్లో చైత‌న్యం నింపే కార్య‌క్ర‌మం కొన‌సాగుతుండ‌టం ఏదో ఒక మేర‌కైనా మ‌హిళ‌ల‌కు మంచే జ‌రుగుతుంది.


Advertisement

Recent Random Post:

Iran – Israel War | ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం | భారత్ పై ప్రభావం ఎంత? |

Posted : October 4, 2024 at 5:54 pm IST by ManaTeluguMovies

Iran – Israel War | ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం | భారత్ పై ప్రభావం ఎంత? |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad