Advertisement

సర్కారు వారి పాట రీ షూట్ గోల ఏంటి?

Posted : January 20, 2022 at 11:20 am IST by ManaTeluguMovies

మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేసి త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడం కోసం మహేష్ బాబు వెయిట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మహేష్ బాబుకు సర్కారు వారి పాట సినిమాలోని కొన్ని సన్నివేశాలు సంతృప్తిని కలిగించలేదని.. అందుకే రీ షూట్ కు వెళ్దామని దర్శకుడితో అన్నాడని.. ఆయన అందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్స్ లో పుకార్లు మొదలు అయ్యాయి. సర్కారు వారి పాట అందుకే ఏప్రిల్ 1 న కాకుండా మళ్లీ వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చారు అనేది ఆ వార్తల సారాంశం. కాని ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ సభ్యులు అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు రీ షూట్ విషయమై కనీసం ఆలోచన కూడా రాలేదు. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం గాలి పుకార్లు మాత్రమే.. ఎవరో యాంటీ మహేష్ బాబు ఫ్యాన్స్ పుట్టించి ఉంటారు అని వారు పేర్కొన్నారు.

ఇలాంటి పుకార్లను అస్సలు నమ్మవద్దు. సినిమా ఖచ్చితంగా మహేష్ అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం కూడా ముందుగా అనుకున్న ప్రకారం.. మహేష్ స్టైల్ మరియు స్టార్ డమ్ కు తగ్గట్లుగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. కథ చెప్పిన సమయంలోనే స్క్రిప్ట్ పై మహేష్ బాబు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు ముందు అనుకున్నట్లుగా షూట్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేయడం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. ఇప్పటి వరకు సినిమా షూటింగ్ సాఫీగా సాగుతుంది.. రీ షూట్ అవసరం ఎక్కడ లేదు.. రాదు అన్నట్లుగా మహేష్ బాబు టీమ్ కూడా చెబుతున్నారు.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో 2020 సంవత్సరంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మహేష్ బాబు కరోనా వల్ల రెండేళ్లు అయినా తన సినిమాను విడుదల చేయలేక పోయాడు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని భావించినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు కరోనా థర్డ్ వేవ్ వల్ల షూటింగ్ ఆలస్యం అవుతుంది. పైగా మహేష్ బాబు కోవిడ్ బారిన పడటం తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ నిర్ణయం అస్సలు మంచిది కాదని క్యాన్సిల్ చేశారు. అందుకే ఏప్రిల్ లో సినిమా విడుదల చేయడం సాధ్యం కావడం లేదు.. అంతే తప్ప రీ షూట్ వ్యవహారమే చర్చ జరగడం లేదు అంటూ టీమ్ మెంబర్స్ చెబుతున్నారు. సర్కారు వారి పాట లో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఆమె హీరోయిన్ గా మహేష్ బాబు తో నటించడం ఇదే ప్రథమం. కనుక ఈ సినిమా పై జనాల్లో ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ నుండి తప్పుకున్న ఈ సినిమా సమ్మర్ చివరి వరకు అయినా విడుదల అవుతుందేమో చూడాలి.


Advertisement

Recent Random Post:

Paradha Concept Video – Telugu | Anupama | Darshana | Sangitha | Praveen Kandregula | Vijay Donkada

Posted : April 26, 2024 at 9:21 pm IST by ManaTeluguMovies

Paradha Concept Video – Telugu | Anupama | Darshana | Sangitha | Praveen Kandregula | Vijay Donkada

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement