Advertisement

ప్ర‌ముఖ ప్యాష‌న్ డిజైన‌ర్‌తో డేటింగ్

Posted : May 20, 2020 at 12:10 pm IST by ManaTeluguMovies

క‌రోనా లాక్‌డౌన్ వేళ డేటింగ్ వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇది బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లాక్‌డౌన్ వేళ ఆ జంట గోవాలో డేటింగ్‌లో ఉన్న‌ట్టు వ‌స్తున్న వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కూ ఆ డేటింగ్ జంట ఎవ‌ర‌నే క‌దా మీ ప్ర‌శ్న‌…అది చెప్ప‌డానికి ఇదంతా. ఆ డేటింగ్ జంట బాలీవుడ్ యాక్ట‌ర్ స‌త్య‌దీప్ మిశ్రా, ప్ర‌ముఖ ప్యాష‌న్ డిజైన‌ర్ మ‌సాబా గుప్తా.

బాలీవుడ్ న‌టుడు స‌త్య‌దీప్ మిశ్రా , న‌టి అదితీరావు హైద‌రి జంట 2013లో విడిపోయారు. తాజాగా స‌త్య‌దీప్ మిశ్రా డేటింగ్‌లో ఉన్న‌ట్టు ఒక్క‌సారిగా వార్త గుప్పుమంది. నిప్పు లేకుండానే పొగ వ‌చ్చే చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మ‌సాబా గుప్తాతో డేటింగ్‌లో ఉన్నాడ‌నే వార్త గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది. ఇద్ద‌రూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతున్న‌ట్టు స‌మాచారం.,

ఈ నేప‌థ్యంలో రెండు నెలల క్రితం ఈ జంట గోవాలో సరదాగా గడిపేందుకు వెళ్లింద‌ని, స‌రిగ్గా అప్పుడే లాక్‌డౌన్ విధించ‌డంతో అక్క‌డే చిక్కుకుపోయార‌నే క‌థ‌నాలు వెలువడుతున్నాయి. వారిద్దరూ డేటింగ్‌ లో ఉన్నారని ముంబై నుంచి వెలువ‌డే మిర్రర్‌ తన కథనంలో పేర్కొంది. కాగా 2015లో దర్శకనిర్మాత మధు మంతెనను మసాబా గుప్తా పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల తర్వాత మధుమంతెనకు విడాకులిచ్చారు.

ఈ నేప‌థ్యంలో మసాబా గుప్తా, స‌త్య‌దీప్ మిశ్రా డేటింగ్‌లో ఉండ‌టంపై స‌హ‌జంగానే బాలీవుడ్‌లో చ‌ర్చకు దారి తీసింది. సోష‌ల్ మీడియాలో వీళ్ల‌ద్ద‌రి గ‌త జీవితాల‌పై కూడా ఆరా తీస్తుండ‌టం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లో త‌మ రిలేష‌న్‌షిప్‌పై ఓ ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉందంటున్నారు.


Advertisement

Recent Random Post:

9 PM | ETV Telugu News | 22nd April 2024

Posted : April 22, 2024 at 10:12 pm IST by ManaTeluguMovies

9 PM | ETV Telugu News | 22nd April 2024

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement