Advertisement

కళాకారుల కష్టాలను కళ్లకు కట్టిన మోహన్ బాబు.. అందరి ముందే ఇలా..

Posted : March 27, 2022 at 2:25 pm IST by ManaTeluguMovies

2019కు ముందు సడెన్ గా వైసీపీకి మద్దతుగా నిలిచి ఆ పార్టీలో చేరిన కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు జగన్ అధికారంలోకి వచ్చినా పెద్దగా పదవులు అయితే దక్కలేదు. అప్పుడప్పుడూ ఈ అసంతృప్తిని బయటపెడుతూ మోహన్ బాబు బరెస్ట్ అవుతున్నారు. తాజాగా వైసీపీకి దూరంగా బీజేపీకి దగ్గరవుతున్నట్టు తెలిసింది. ప్రధాని మోడీని కలవడం.. తాజాగా బీజేపీ కార్యక్రమంలో పాల్గొని పొగడడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.

సినీ నటుడు మోహన్ బాబు సినిమాలతోపాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. కళాకారుల గురించి ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. బీజేపీ జాతీయ సంస్కృతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సభలో ప్రధాని మోడీకి మోహన్ బాబు జైకొట్టడం విశేషం.

బీజేపీ జాతీయ సంస్కృతిక మహోత్సవం సభలో సినీ నటుడు మోహన్ బాబు మాట్లాడారు. ఎందరో కళాకారులు తిండి ఇళ్లు లేక కష్టాలు పడుతున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కళాకారులను ఆదుకుంటున్నారో లేదో అవంతి శ్రీనివాస్ కు తెలుసు అన్నారు. తెలంగాణలోనూ జానపద కళాకారులు కష్టాలు పడుతున్నారని మోహన్ బాబు అన్నారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కళాకారులను ఆదుకునే బాధ్యత తీసుకోవాలని మోహన్ బాబు కోరారు. నృత్య జానపద కళాకారులను ఆదుకోవడం ఏపీ తెలంగాణ నుంచే ప్రారంభించాలని అన్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉండడం వల్లే తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.

1998లో నేను ఏపీలో బీజేపీకి ప్రచారం చేస్తే 18శాతం ఓట్లు వచ్చాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఉన్నత పదవులు రావాలని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ పై తనకు గౌరవం ఉందని మోహన్ బాబు తెలిపారు.


Advertisement

Recent Random Post:

Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు

Posted : April 24, 2024 at 12:40 pm IST by ManaTeluguMovies

Gold Price Today : భారీగా తగ్గిన బంగారం ధరలు

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement

Politics

Advertisement
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement