Advertisement

మాతృ వియోగంతో నటుడు మురళీశర్మ ఇంట్లో విషాద ఛాయలు.!

Posted : June 8, 2020 at 3:58 pm IST by ManaTeluguMovies

ఈ ఏడాది ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అల్లు అర్జున్ ఫాదర్ వాల్మీకి పాత్రలో ప్రేక్షకులను మెప్పించిన ప్రముఖ నటుడు మురళీశర్మ ఇంట విషాదం చోటు చేసుకుంది. మురళీశర్మ తల్లిగారైన శ్రీమతి పద్మ శర్మ గారు గుండెపోటుతో మరణించారు. 76 ఏళ్ళ వయసు కలిగిన పద్మ శర్మ గారు గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. గత రాత్రి ముంబైలోని మురళీశర్మ స్వగృహంలో ఆవిడ కన్ను మూశారు. దీనితో మురళీశర్మ కుటుంబం శోఖ సముద్రంలో మునిగింది.

మహేష్ బాబు ‘అతిధి’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన మురళీశర్మ ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం తెలుగులో బిజీ బిజీ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు | Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi

Posted : September 13, 2024 at 11:45 am IST by ManaTeluguMovies

హైదరాబాద్ లో బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్టులు | Padi Kaushik Reddy Vs Arekapudi Gandhi

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad