Advertisement

పవన్‌ స్టార్‌తో మాటల మాంత్రికుడు మరోసారి?

Posted : May 7, 2020 at 8:11 pm IST by ManaTeluguMovies

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మాటల మాంత్రికుడు కాంబోలో ఇప్పటి వరకు జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాలు వచ్చిన విషయం తెల్సిందే. అత్తారికింటికి దారేది చిత్రం ఇండస్ట్రీ హిట్‌ అవ్వగా అజ్ఞాతవాసి మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. పవన్‌ ప్రతిష్టాత్మక చిత్రంగా తెరకెక్కిన అజ్ఞాతవాసి చిత్రం డిజాస్టర్‌ అవ్వడంతో ఆయన సినిమాలే వదిలేస్తాడని అనుకున్నారు. అజ్ఞాతవాసి వచ్చిన రెండేళ్ల తర్వాత పవన్‌ ఎట్టకేలకు వకీల్‌ సాబ్‌ చిత్రంను చేస్తున్నాడు.

పవన్‌ ఆర్థిక అవసరాల కోసం అంటూ వరుసగా సినిమాలకు కమిట్‌ అయ్యాడు. ఇప్పటికే వకీల్‌ సాబ్‌ చిత్రంతో పాటు క్రిష్‌ దర్శకత్వంలో ఒక చిత్రం హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మరో సినిమాను చేయబోతున్నాడు. ఇదే సమయంలో డాలీతో కూడా ఒక సినిమాను చేయబోతున్నట్లుగా ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాలే కాకుండా త్రివిక్రమ్‌ కూడా పవన్‌ కోసం ఒక స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

వచ్చే ఏడాది ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల మూవీ రాబోతుంది. ఆ చిత్రం తర్వాత పవన్‌తో త్రివిక్రమ్‌ మూవీ ఉంటుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. త్రివిక్రమ్‌, పవన్‌ల కాంబోలో కోబలి అనే సినిమాను అనుకున్నారు. కాని ఆ సినిమా ఎక్కువ డేట్లు అవసరం అవుతాయి. దాంతో ఆ ప్రాజెక్ట్‌ కాకుండా కేవలం మూడు నాలుగు నెలల్లో పూర్తి చేయగల స్క్రిప్ట్‌ను త్రివిక్రమ్‌ రెడీ చేస్తున్నాడట. అజ్ఞాతవాసితో నిరాశపర్చినందుకు పవన్‌ ఫ్యాన్స్‌ను ఈసారి సంతృప్తి పర్చాలని త్రివిక్రమ్‌ అత్తారింటికి దారేది రేంజ్‌లో స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నాడట. అయితే ఈ సినిమా వచ్చేందుకు కనీసం రెండేళ్లు అయినా పట్టవచ్చు అంటున్నారు.


Advertisement

Recent Random Post:

Chittoor District : మొగిలి దగ్గర మరో రోడ్డు ప్రమాదం | AP News

Posted : September 14, 2024 at 12:07 pm IST by ManaTeluguMovies

Chittoor District : మొగిలి దగ్గర మరో రోడ్డు ప్రమాదం | AP News

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad