Advertisement

ఇది కూడా పబ్లిసిటీ కోసమేనా పూనమ్‌?

Posted : May 29, 2020 at 10:51 pm IST by ManaTeluguMovies

స్టార్స్ అంతా కూడా పబ్లిసిటీతోనే బతికేస్తారు. పబ్లిసిటీ వల్లే వారికి ఆదాయం వస్తుంది. అందుకే పబ్లిసిటీ కోసం ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్దం అవుతారు. వర్మ వంటి వారు పబ్లిసిటీ కోసం వివాదాస్పద అంశాలను లేవనెత్తడం చేస్తూ ఉంటారు. ఇక వర్మను ఇప్పుడు ఎంతో మంది ఫాలో అవుతున్నారు. రామ్‌ గోపాల్‌ వర్మ మాదిరిగా ఎంతో మంది స్టార్స్‌ పబ్లిసిటీ కోసం పిచ్చి పనులు చేయడం చాలా కామన్‌ అయ్యింది. తాజాగా హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ చేస్తున్న ప్రతి పని కూడా పబ్లిసిటీ కోసమే అని రుజువు అవుతుంది.

ఆమద్య పలువురు సినీ ప్రముఖులపై ఇండైరెక్ట్‌గా పోస్ట్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె సినిమాలు చేసింది తక్కువే అయినా కూడా మీడియ ద్వారా దక్కించుకున్న పబ్లిసిటీ ఎక్కువ. వివాదాస్పద అంశాలతో ఈ అమ్మడు ఎన్నో సార్లు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ అమ్మడు చేసిన ప్రతి పని కూడా పబ్లిసిటీ కోసమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్దకు వెళ్లడం కూడా పబ్లిసిటీ కోసమే అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

గతంలో ఎప్పుడు ఎన్టీఆర్‌ జయంతికి ఘాట్‌ వద్దకు వెళ్లని పూనమ్‌ ఇప్పుడు ఎందుకు వెళ్లినట్లు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్‌, కళ్యాణ్‌ రామ్‌తో పాటు పలువురు కరోనా కారణంగా ఎన్టీఆర్‌ ఘాట్‌ను ఈసారి సందర్శించలేదు. అలాంటిది ఈమె మాత్రం పబ్లిసిటీ కోసమే అలా వెళ్లిందని అంటున్నారు. ఆమె కోరుకున్నట్లుగా భారీగానే పబ్లిసిటీ వచ్చిందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.


Advertisement

Recent Random Post:

సంచలన విషయాలు బయటపెట్టిన జానీ మాస్టర్ బాధితురాలు.. | Jani Master Case Updates |

Posted : September 16, 2024 at 8:45 pm IST by ManaTeluguMovies

సంచలన విషయాలు బయటపెట్టిన జానీ మాస్టర్ బాధితురాలు.. | Jani Master Case Updates |

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad