‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. మరి.. కళ్లు చూసి నమ్మేయాలి డ్యూడ్ అంటున్నారేంటీ అనుకుంటున్నారా? దానికో కారణం ఉంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్యాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో రాముడి పాత్రలో కనిపించనున్నారు ప్రభాస్. రాముడి పాత్ర అంటే సౌమ్యంగా ఉంటుంది. ప్రభాస్ ఏమో యంగ్ రెబల్ స్టార్. మరి.. ఎలా సూట్ అవుతుందీ అంటే… ఓంరౌత్ చెబుతున్న సమాధానం ఒక్కటే. ‘‘ప్రభాస్ కళ్లను చూసి ఆయన మాత్రమే ఈ పాత్రకు నప్పుతారని ఫిక్స్ అయ్యాను. ప్రభాస్ చూపులు చాలా తీక్షణంగా ఉంటాయి. ఆ కళ్లల్లో కరుణ కనబడుతుంది. అలాగే తన బాడీ లాంగ్వేజ్ కూడా ఈ క్యారెక్టర్కి బాగుంటుంది. ప్రభాస్ ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు ఓం రౌత్. సో.. కళ్లు చూసి నమ్మేయాలి డ్యూడ్.
కళ్లు చూసి నమ్మేయాలి డ్యూడ్
Advertisement
Recent Random Post:
తమ్ముడి కోసం రంగంలోకి అన్న..పిఠాపురం లో చిరంజీవి ప్రచారం | Chiranjeevi Campaign In Pithapuram
తమ్ముడి కోసం రంగంలోకి అన్న..పిఠాపురం లో చిరంజీవి ప్రచారం | Chiranjeevi Campaign In Pithapuram