Advertisement

కేజీఎఫ్‌ డైరెక్టర్‌కు దానయ్య కూడా అడ్వాన్స్‌ ఇచ్చాడా?

Posted : June 4, 2020 at 11:03 pm IST by ManaTeluguMovies

కేజీఎఫ్‌ చిత్రంతో హీరో యశ్‌ మరియు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ఇద్దరు కూడా ఒకేసారి ఆల్‌ ఇండియా స్టార్స్‌ అయ్యారు. ప్రస్తుతం తెరకెక్కుతున్న కేజీఎఫ్‌ 2 చిత్రం తర్వాత వీరి స్థాయి మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. కేజీఎఫ్‌ చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తదుపరి చిత్రం ఇప్పటికే తెలుగులో అని ఖరారు అయ్యింది. భారీ బడ్జెట్‌తో పాటు పెద్ద హీరోలతో సినిమాలు చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ టాలీవుడ్‌ వైపు అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ మూవీ దాదాపుగా ఖరారు అయ్యింది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ మూవీ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇదే సమయంలో ప్రశాంత్‌ నీల్‌ కు ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత దానయ్య కూడా అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తుంది.

ఆ పుకార్లకు బలం చేకూర్చేలా నేడు ప్రశాంత్‌ నీల్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఏకంగా ఒక పోస్టర్‌నే అధికారిక ఖాతాలో పోస్ట్‌ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌కు భారీ మొత్తంలో దానయ్య అడ్వాన్స్‌ ఇచ్చినట్లుగా క్లారిటీ వచ్చేసింది. సక్సెస్‌ దర్శకులకు అడ్వాన్స్‌లు ఇచ్చి బుక్‌ చేసుకోవడం దానయ్యకు అలవాటు.

ఇలాగే రాజమౌళిని కూడా చాలా ఏళ్ల క్రితం అడ్వాన్స్‌ ఇచ్చి లాక్‌ చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో దానయ్య కు రాజమౌళి సినిమా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌కు కూడా దానయ్య అడ్వాన్స్‌ ఇచ్చి ఎప్పటికి అయినా సినిమా చేద్దామంటూ హామీ తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


Advertisement

Recent Random Post:

ఆంధ్రనాట సైలెంట్ ఓటింగ్ జరగనుందా.? ఓటర్ మైండ్సెట్ పార్టీలకు పజిల్గా మారిందా.?

Posted : April 22, 2024 at 12:00 pm IST by ManaTeluguMovies

ఆంధ్రనాట సైలెంట్ ఓటింగ్ జరగనుందా.? ఓటర్ మైండ్సెట్ పార్టీలకు పజిల్గా మారిందా.?

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement