Advertisement

రాధేశ్యామ్‌.. ఆ సన్నివేశాల కోసం భారీ వీఎఫ్‌ఎక్స్ వర్క్‌

Posted : May 5, 2021 at 12:11 pm IST by ManaTeluguMovies

ప్రభాస్ రాధేశ్యామ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్‌ కు జోడీగా పూజా హెగ్డే నటించగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. 1980 టైమ్‌ ప్రేమ కథతో ఈ సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. సినిమా కథ ఎక్కువగా ఇటలీ బ్యాక్‌ డ్రాప్ లో సాగుతుందట. ఇప్పటికే షూటింగ్‌ ను ఇటలీలో నిర్వహించారు. కాని కరోనా వల్ల షూటింగ్‌ ను మళ్లీ అక్కడ ముగించడానికి వీలు లేకుండా పోయింది.

ఇటలీలో షూటింగ్‌ జరుపలోని సన్నివేశాలను ఇప్పుడు హైదరాబాద్‌ లో పూర్తి చేసి విఎఫ్‌ఎక్స్ వర్క్‌ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ సినిమా షూటింగ్ ను ముగించేందుకు మరో రెండు వారాల పాటు చిత్రీకరణ చేయాల్సి ఉందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలు అయ్యింది. దాంతో షూటింగ్ ఆగిపోయింది. కాని వీఎఫ్‌ఎక్స్ వర్క్ మాత్రం సాగుతుందని తెలుస్తోంది.


Advertisement

Recent Random Post:

సీఎం చంద్రబాబు కామెంట్స్ పై పేర్ని నాని రియాక్షన్

Posted : June 29, 2024 at 11:36 am IST by ManaTeluguMovies

సీఎం చంద్రబాబు కామెంట్స్ పై పేర్ని నాని రియాక్షన్

Advertisement
Advertisement
728x90 Ad
Advertisement
Advertisement
728x90 Ad
Advertisement